• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

MBNR: తొర్రూరు మండలం వెలికట్టే శివారులో మంగళవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెలికట్టే శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని, లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామన్నారు.

March 19, 2025 / 10:43 AM IST

గోవాకు బయలు దేరిన క్రీడాకారుల బృందం

HNK: గోవాలో ఐదు రోజులపాటు జరిగే నలభై ఏడవ భారత మాస్టర్స్ (వెటరన్) నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు హనుమకొండ జేఎన్ఐఎస్ నుండి 18 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు నేడు వెళ్లారు. టీబిఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షటిల్ క్రీడాకారులు ఉత్సాహంగా హనుమకొండ నుండి గోవా బయలుదేరారు.

March 19, 2025 / 10:13 AM IST

రాములోరి భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు: కలెక్టర్

BDK: ఏప్రిల్ 6న శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పేర్కొన్నారు.

March 19, 2025 / 10:05 AM IST

ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు

జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.

March 19, 2025 / 09:48 AM IST

ఉద్యమకారులను ఆదుకోవాలి: జేఏసీ

KMM: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి ప్రస్తావించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2025 / 09:20 AM IST

రంజాన్ వేల వరంగల్‌లో పోలీసుల పహారా

WGL: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వరంగల్ పరిధిలోని మండిబజార్ ప్రాంతంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో పాటు శాంతి భద్రతలో భాగంగా ఏసీపీ స్థాయి పోలీస్ అధికారులు, స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసులు ఈ ప్రాంతంలో పహారా కాస్తున్నారు.

March 19, 2025 / 08:50 AM IST

పాఠశాలలో మద్యం సేవించిన అటెండర్ విధులనుండి తొలగింపు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ హై స్కూల్లో అటెండర్‌గా పని చేస్తున్న బండి రాకేష్ విద్యార్థితో కలిసి మంగళవారం పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తూన్న ఫోటోలు డిఈఓ జనార్ధనరావు దృష్టికి వెళ్లాయి. దీంతో స్పందించిన డీఈవో పాఠశాల హెచ్ఎం జితేందర్‌తో మాట్లాడి అటెండర్‌ను తొలగించాలని మౌఖికంగా ఆదేశించడంతో, అటెండర్‌ను విధులనుండి తొలగించినట్లు హెచ్ఎం తెలిపారు .

March 19, 2025 / 08:18 AM IST

కారుణ్య నియామకాల పత్రాలు అందజేత

MNCL: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 40 మందికి కారుణ్య నియామక పత్రాలను ఏరియా జీఎం దేవేందర్ అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకల ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.

March 19, 2025 / 08:12 AM IST

మైనర్‌పై అత్యాచారం.. యువకుడిపై పోక్సోకేసు

BDK: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసారు.

March 19, 2025 / 07:57 AM IST

నేడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో నేడు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నారు. తలకొండపల్లి మండలంలోని రామకృష్ణాపురం, దేవుని పడకల్ గ్రామాల్లో సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రభలు తిప్పుట కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

March 19, 2025 / 07:45 AM IST

హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

HYD: హైదరగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 19, 2025 / 06:23 AM IST

వరంగల్ రైతులకు రూ.5కే భోజనం

WGL: ఆరుగాలం పండించి పంట అమ్ముకోవడానికి వచ్చే రైతులకు మున్సిపల్ అధికారులు భోజనం అందుబాటులో పెట్టారు. హరే రామ హరే కృష్ణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో రూ.5కు భోజనం అందుబాటులో పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి యార్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి భోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

March 19, 2025 / 06:17 AM IST

రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించిన రవీందర్

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందరు పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు.

March 19, 2025 / 04:07 AM IST

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

MLG: పురుగుల మందు తాగి ఓ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రామెళ్ల సతీష్ (39) అనే వ్యక్తి మిర్చి సాగు పంటలో పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు.

March 18, 2025 / 08:19 PM IST

కుష్టు వ్యాధి నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా సర్వే

BHPL: వైద్యాధికారి డా. మధుసూదన్ కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. నేడు తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

March 18, 2025 / 06:53 PM IST