• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

WGL: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఓ ఫార్మా కంపెనీ 100 ఉద్యోగాలకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పన జిల్లా అధికారి సీహెచ్ ఉమారాణి తెలిపారు. రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీ ఫార్మాసిస్ట్, ఫార్మాసిస్ట్ విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డీ ఫార్మా, బీ ఫార్మా, ఎం ఫార్మా అభ్యర్థులు అర్హులన్నారు.

January 29, 2025 / 04:06 AM IST

త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి

MNCL: గ్రామాలలో పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే నిర్వహించాలని బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ కోరారు. మంగళవారం ఆయన జన్నారంలో మాట్లాడుతూ.. అధికారులు సర్వేలలో బిజీగా ఉండటంతో గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

January 28, 2025 / 09:45 AM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

NRML: విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని డీఇఓ రామారావు అన్నారు. మంగళవారం లక్ష్మణ్ చందా మండలం ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.

January 28, 2025 / 09:36 AM IST

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

MNCL: జన్నారం అటవీ డివిజన్ ఇంధన్ పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కవ్వాల్ సెక్షన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ కనిపించడంతో పట్టుకొని సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.

January 28, 2025 / 09:20 AM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

MNCL: నెన్నెల మండల కేంద్రంలోని బ్యాంకు రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గట్టు మల్లేష్, గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్‌లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట సుజాత, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కంపెల రాజశేఖర్, తదితరులు ఉన్నారు.

January 28, 2025 / 09:00 AM IST

రోడ్డు నిబంధనలు పాటించాలి: ఎస్ఐ

KMR: వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు చెప్పారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా రవాణ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.

January 28, 2025 / 07:18 AM IST

ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కేంద్ర బృందం

నిజామాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య బృందం తనిఖీ చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రస్ట్ డా.తంగ్, డా.ఫ్రాన్సిస్ జబీర్ నేషనల్ హెల్త్ మిషన్ అమలు తీరును పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరికరాలు, వసతుల వివరాలు సేకరించారు. వారి వెంట సూపరింటెండెంట్ డా.రవీంద్ర మోహన్, పద్మజ ఉన్నారు.

January 28, 2025 / 06:18 AM IST

“అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి’

NZB: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికివాడల్లోని ప్రజలు ఇళ్లు, రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి మైనారిటీ స్లమ్‌ డివిజన్‌లో 400 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

January 28, 2025 / 06:11 AM IST

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ASF: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధన అందించాలని అన్నారు.

January 28, 2025 / 04:06 AM IST

ఈ నెల 29న భవన నిర్మాణ కార్మికుల మహాసభలు

MNCL: ఈ నెల 29న సిద్దిపేటలో జరగనున్న తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని బీఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కమలాకర్, మద్దూరి రాజు యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాలలోని మహాసభల పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.

January 27, 2025 / 05:22 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

SRPT: తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన పోలేపాక రామచంద్రు తండ్రి బిక్షం ఇటీవల గుండెపోటుతో మరణించడంతో సోమవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు రేగటి రవి బిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. వారి వెంట దాసరి శ్రీను, వెంకటేష్, శ్రీకాంత్, ఎల్లయ్య పాల్గొన్నారు.

January 27, 2025 / 05:08 PM IST

రైతు భరోసాకు డేటా ఎంట్రీ చేసుకోవాలి: జన్నారం ఏవో

MNCL: యాసంగి రైతు భరోసా డాటా ఎంట్రీ కానివారు ఈనెల 31 వరకు ఏవో కార్యాలయంలో సంప్రదించాలని ఏవో సంగీత సోమవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాటా ఎంట్రీ కోసం పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లను విధిగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

January 27, 2025 / 04:36 PM IST

స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు జిల్లా పోలీసులు

NRML: ఇటీవల బాసర జోన్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీటింగ్ కొరకు 16 మంది వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో వారిని అభినందించి, స్టేట్ స్పోర్ట్స్ మీట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టి మెడల్స్ వచ్చేలా ఆడాలని, ఆల్ ఇండియా లెవల్‌కు ఎంపిక కావాలని కోరారు.

January 27, 2025 / 04:32 PM IST

అంగన్వాడీ భవనానికి భూమి పూజ

MNCL: జన్నారం మండలంలోని రాంపూర్లో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ భూమి పూజ నిర్వహించారు. సోమవారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనానికి భూమి పూజ చేశారు. ప్రజల మేలుకోసమే అంగన్వాడి కేంద్రాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడబ్లుఓ రవూఫ్, సిడిపిఓ రేష్మ, తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఉన్నారు.

January 27, 2025 / 04:21 PM IST

డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. మల్లయ్యపల్లి, అచ్చాయిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అధికారులు పాల్గొన్నారు.

January 27, 2025 / 03:52 PM IST