MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ కథనం ప్రకారం ఆ గ్రామానికి చెందిన జి. పోచమ్మల్లు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామానులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ధాన్యం బస్తాలు కాలిపోయి రూ.మూడు లక్షల వరకు నష్టం వచ్చి ఉంటుందన్నారు.
ADB: TSUTF రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా బాధ్యతలు చేపట్టిన వెంకటి మొదటి సారిగా ఆదిలాబాద్ వచ్చిన సందర్భంగా TSUTF నేరడిగొండ మండల బాధ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మండల బాధ్యులు జ్యోతి, శివలీల, తదితరులు ఉన్నారు.
MNCL: ప్రభుత్వ ఉపాధ్యాయులకు నష్టం చేసే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పీఆర్టియు జన్నారం మండల నాయకులు కోరారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలో స్థానిక తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు మండల బాధ్యులు ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా డిపో మేనేజర్ వేధింపులు భరించలేక విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు RTC కార్మికులు ఆరోపించారు. మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా అధ్యక్షుడు దివాకర్ సోమవారం డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి DM కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KMM: రైతాంగంపై మోదీ సర్కార్ కక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని, మిగిలిన రంగాలతో పోల్చినప్పుడు వివక్షతను ప్రదర్శిస్తుందని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో అయన మాట్లాడారు.
SRD: విద్యార్థుల గుర్తింపు కోసం తీసుకువచ్చిన అపార్ దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
మెదక్: ఆసుపత్రులలో శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారిని కార్మికులుగా చూడకుండా ఉత్తమ సేవకులుగా భావిస్తూ గౌరవించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శివదయాళ్ అన్నారు. మెదక్ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే 40 మంది శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.
JGL: జగిత్యాల, రాయికల్, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డిని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఇవాల్టి నుంచి ప్రత్యేక ఆఫీసర్ పాలన కొనసాగనుంది.
NZB: బడుగు బలహీన వర్గాలకు దైవం అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం సాతోలీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు అన్ని వర్గాలకు అందుతున్నాయని తెలిపారు. రిజర్వేషన్లు మూలంగా అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని లింగారెడ్డిపేటలో అర్బన్ పార్కును ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు పెంచితేనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. నేడు పెట్టిన మొక్కలు భవిష్యత్తులో మహారుక్షాలుగా ఎదిగి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కోరారు.
నిజామాబాద్: బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బంగారు సాయిలు, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయ్, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నర్సింలు, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య ఉన్నారు.
KMR: నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రారంభించి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.
KMM: రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో జరుగుతున్న ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
SRD: పటాన్చెరులోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 35వ, మైత్రి క్రికెట్ ఇన్విటేషన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. నియోజకవర్గంలో యువ క్రికెటర్లను తయారు చేయడంలో మైత్రి క్రికెట్ క్లబ్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.
SRD: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ మీర్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు డైరెక్టర్ను ఆశీర్వదించి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు.