• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి’

SRCL: వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ త్రాగు నీటి సరఫరా, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

March 18, 2025 / 06:49 PM IST

డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

SRCL: డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మనోహర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ బీసీ యువతీ, యువకులు ఈనెల 31 వరకు జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ డ్రైవింగ్ ఉచిత ట్రైనింగ్ హైదరాబాదులోని హకీంపేటలో ఉంటుందని పేర్కొన్నారు.

March 18, 2025 / 06:48 PM IST

అదనపు కట్నం కోసం వేధింపులు.. ముగ్గురు అరెస్ట్

SRCL: ఎల్లారెడ్డిపేట(M) అక్కపల్లిలో వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. గ్రామానికి చెందిన రాధిక అనే మహిళకు హరిదాస్‌నగర్ గ్రామానికి చెందిన చీకట్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. భర్త శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ రాజయ్య రాధికను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

March 18, 2025 / 06:34 PM IST

దేవాదుల పంప్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి

HNK: ప్రతి ఏకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ మోటార్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉత్తంకుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.

March 18, 2025 / 06:17 PM IST

పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర కీలకం

KNR: పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర కీలకమని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా 2025 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై, మాట్లాడుతూ.. పిచ్చుకలు పర్యావరణ మిత్రులని తెలిపారు. నేడు జీవవైవిద్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

March 18, 2025 / 06:03 PM IST

హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

KNR: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని MLA పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మా నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కౌశిక్ రెడ్డి కోరారు.

March 18, 2025 / 05:27 PM IST

‘శాంతి భద్రతల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి’

SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే సూచించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

March 18, 2025 / 05:19 PM IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలు

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు వనపర్తి కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఆంజనేయులు, రాజు, శారద మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

March 18, 2025 / 05:17 PM IST

’15 రోజుల్లో పరిష్కరిస్తాం’

BDK: జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, కావడిగుడ్ల, కొండారెడ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గిరి వికాస్ పథకం ద్వారా కరెంటు బోర్ మోటార్ల ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజులలో పోడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 18, 2025 / 04:59 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు

JGL: మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించి హెల్త్ చెకప్ చేశారు. ఈ సంద్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయించి, అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

March 18, 2025 / 04:47 PM IST

‘వర్గీకరణ అమలయ్యే వరకు నియామకాలు నిలిపివేయాలి’

KMM: ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.

March 18, 2025 / 04:03 PM IST

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ల పంపిణీ

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు సక్సెస్ కిటును వర్ధిని ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు లేనిన్, చిలుక విన్నూ, మురళి పాల్గొన్నారు.

March 18, 2025 / 03:26 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన డీఆర్డీవో

BHPL: ఎడ్లపల్లి గ్రామ పంచాయతీలోని వాటర్ హార్వెస్టింగ్ కమ్యూనిటీ పాండ్ పనులను డీఆర్డీవో నరేశ్ సందర్శించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి, రోజుకు రూ.300 సంపాదించేందుకు కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మంచినీరు, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

March 18, 2025 / 02:57 PM IST

జయ నర్సింగ్ కళాశాలను సీజ్ చేసిన అధికారులు

HNK: గత మూడేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్‌కు బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను రూ. 44 లక్షలు చెల్లించని కారణంగా కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండలోని జయ నర్సింగ్ కాలేజీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించాలని కోరుతూ రెడ్ నోటీస్ జారీ చేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో నర్సింగ్ కళాశాల విద్యార్థులను సిబ్బందిని బయటికి పంపించి సీజ్ చేశారు.

March 18, 2025 / 02:00 PM IST

“బీసీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు విస్మరించింది”

MBNR: గడచిన పది సంవత్సరాల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్వరించిందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

March 18, 2025 / 01:52 PM IST