HYD: లేక్ PS, సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఖైరతాబాద్ మ.సీ. మర్థా ప్రాంతంలో గంజాయి రవాణాను భగ్నం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీపక్ పాండా, కుముదిని పాండా, సోను కుమార్ను అదుపులోకి తీసుకుని 1.4 కిలోల గంజాయి, 10 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
BHNG: భువనగిరి మండలం తాజ్ పూర్కు చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె పరిస్థితి చూసి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా సామాజికవేత్త డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి చేయూతనిచ్చారు. ఆ ఇంటిని శనివారం రంజాన్ సందర్బంగా గృహప్రవేశం చేయించారు.
MLG: పట్టణ కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ నివాసంలో శనివారం రాత్రి రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లిం ప్రజలకు పవిత్రమైన నెల అని అన్నారు. అల్లా దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.
NGKL: ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో పనులు ప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్ లెట్ వైపు సొరంగం పనులు ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 22న ఇన్ లెట్ పనుల్లో 13.95 కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పుకూలి ప్రమాదం చోటు చేసుకుంది.
ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో క్యాతన పల్లిలోని పలు వార్డ్లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం 10 గంటలకు మందమర్రిలో రూ. 2.31 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
SDPT: నంగునూరు (M) నర్మెటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్ కలిసి హెలిప్యాడ్, సభాప్రాంగణం, 150 స్టాళ్లను పరిశీలించారు.
MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామంలో ఎస్ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల నిషేధం, సిసి కెమేరాల ఏర్పాటుపై ఎస్ఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ కనకటి అచ్చమ్మవీరన్న, ఉపసర్పంచ్ దేవి శ్రీను, వార్డ్ సభ్యులు అయనను సన్మానించారు.
WGL: చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 1141 మంది రైతులు సాదా బైనామా ద్వారా దరఖాస్తులు చేసుకుని నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆరోపించారు. పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నూతన 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని శనివారం సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, ఎఫ్ఎవో కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో మంజూరైన ఈ ఉపకేంద్రాన్ని ఎకో టూరిజం పార్క్ సమీపంలో నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసింది. స్థలానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు తెలిపారు.
SRPT: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు ఏ మాత్రం బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు.
BHNG: హైదరాబాద్లోని నార్సింగ్కు చెందిన అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం యాదగిరిగుట్టకు వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్గా బస్సు కదిలింది. ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది. ఆమెకు కాలుకు స్వల్పంగా గాయాలయ్యాయి.
MBNR: ఎంపీ డీకే అరుణ శనివారం జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ప్రారంభించారు. పోచమ్మగుడి ఊరచెరువు అభివృద్ధికి అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.కోటి,11లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు ఆమె భూమిపూజ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
VKB: మోమిన్పేట మండల కేంద్రంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు అధ్వాన్నంగా తయారవ్వడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి వచ్చే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనాదారులు కోరుతున్నారు.
MDK: నార్సింగి మండలం షేర్ పల్లి గ్రామానికి చెందిన పంబల శ్యామల వైద్య చికిత్స నిమిత్తం మైనంపల్లి రోహిత్ రావు తన ఉదారతను చాటుకున్నారు. బాధితురాలి కుటుంబానికి మంజూరైన రూ. 2,50,000 ఎల్వోసీ (LOC) పత్రాన్ని ఆయన స్వయంగా అందజేశారు. శ్యామల త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన రోహిత్ రావుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.