BHPL: పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.
BDK: పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల 76 క్వింటాల మిర్చి కల్లాన్ని తగలబెట్టిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మిర్చి కల్లాన్ని తగలబెట్టినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ వివరాలు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి డిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
NZB: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లో మోహన్ రెడ్డి నూతన ఎమ్మెల్సీకి నాయక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLC మట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని నాయకత్వం గుర్తిస్తుందన్నారు.
KMR: నేడు కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ఆర్డీవో, ఏవో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
WGL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్) ఆవరణలో గల మామిడి తోట ప్రస్తుత సంవత్సర కాపును వేలం వేయుటకు నిర్ణయించినట్లు ప్రిన్సిపల్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు కళాశాలలో ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు సంప్రదించాలని సూచించారు.
KMR: జాతీయ రహదారి 161లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ రావు పల్లి నుంచి పిట్లం వైపు బైకుపై వెళ్తున్న క్రమంలో మరో బైక్ వెనక నుంచి ఢీ కొట్టిందని హైవే సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో నర్సింగ్ రావుపల్లి గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్కి గాయాలు కాగా అంబులెన్స్లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు.
SRCL: అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శాసన సభలో బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సమావేశమయ్యారు.
KMM: తల్లాడ మండల కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దగ్గుల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి పనులను చేపట్టినట్లు పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలి ఆవరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి తాతా మధు మిర్చి రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా మిర్చి పంటను రూ. 25 వేలకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
HYD: ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నేపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
మేడ్చల్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కారు డ్రైవర్ అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధి హకీంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. హకీంపేటలో నివసించే సాయిరాం(23) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 15న పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NZB: నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు సైకిల్ను ఢీకొన్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో సైకిల్ నడుపుతున్న చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11) తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు జిల్లాలోని శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.
SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటూ.. అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు.
NGKL: లింగాల మండలానికి చెందిన సామజిక వేత్త డాక్టర్ నూకల శంకర్ బాబు హైదరాబాద్లో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో అందించే ప్రతిష్ఠాత్మకంగా ఉగాది పురస్కారం అవార్డును శనివారం పలువురు సీరియల్ నటుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని కోరారు.