• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

NLG: తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డ సంఘటన దేవ‌ర‌కొండ మండలం ముదిగొండ గ్రామంలో శ‌నివారం జ‌రిగింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముదిగొండ గ్రామానికి చెందిన యాదయ్య ప్రతిరోజు తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా చెట్టు పైనుంచి ఒక్కసారిగా కింద‌ప‌డ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

March 22, 2026 / 07:12 AM IST

‘లేబర్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలి’

PDPL: పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ హేమలతపై చర్యలు తీసుకోవాలని దళిత, బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకట స్వామికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటూ, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు.

March 22, 2026 / 07:11 AM IST

బ్రెయిన్ స్ట్రోక్‌తో యువకుడు మృతి

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే (40) సంవత్సరాల యువకుడు నిజామాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి వెళ్లిన రామ్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో మృతి చెందారు. శనివారం సాయంత్రం రామ్ రెడ్డి మృతిని గమనించారు.

March 22, 2026 / 07:09 AM IST

గ్రీన్ హోమ్స్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమం

RR: నాదర్‌గుల్‌లోని గ్రీన్ హోమ్స్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా, తాజా డిజిటల్ అరెస్టుల వాటిపై వివరించారు. మోసపూరిత కాల్స్, ఓటీపీలు/పాస్‌వర్డ్‌ను పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు పాస్‌వర్డ్‌ ఇవ్వకూడదని సూచించారు.

March 22, 2026 / 07:09 AM IST

రేపటి ప్రజావాణి రద్దు

SDPT: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు.

March 22, 2026 / 07:08 AM IST

‘సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

MBNR: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కుల వృత్తుల వారు, చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కులవృత్తుల సంఘాలతో ఎంపీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వర్ణకారులు, గొల్ల కురుమలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని వెల్లడించారు.

March 22, 2026 / 07:06 AM IST

ఉచిత గిఫ్ట్స్ అంటే నమ్మొద్దు: ఎస్సై

VKB: ఉచిత గిఫ్టులు, లాటరీల పేరుతో వచ్చే ఆఫర్లకు ఆశపడి మోసపోవద్దని ధరూర్ ఎస్సై రాఘవేందర్ ప్రజలను కోరారు. ఉచితం అంటే అది కచ్చితంగా మోసమేనని గుర్తించాలని సూచించారు. ప్రజల అత్యాశనే మోసగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారని, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అనుమానిత లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు.

March 22, 2026 / 07:04 AM IST

నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం

JGL: జిల్లా కేంద్రంలోని 33KV టౌన్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆదివారం ఉ. 9-12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డివిజనల్ ఇంజనీర్ కె.గంగారాం తెలిపారు. జగిత్యాల పట్టణంలోని చిలుకవాడ, మోతే చౌరస్తా, జంబి గద్దె, తహసీల్ చౌరస్తా ప్రాంతాలతో పాటు మోతే, వెల్దుర్థి, గొల్లపల్లి గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

March 22, 2026 / 06:57 AM IST

నగరంలో గంజాయి రవాణా భగ్నం.. ముగ్గురు అరెస్ట్

HYD: లేక్ PS, సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఖైరతాబాద్ మ.సీ. మర్థా ప్రాంతంలో గంజాయి రవాణాను భగ్నం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీపక్ పాండా, కుముదిని పాండా, సోను కుమార్‌ను అదుపులోకి తీసుకుని 1.4 కిలోల గంజాయి, 10 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.

March 22, 2026 / 06:52 AM IST

పేద ముస్లీం మహిళకు ఇల్లు కట్టిచ్చిన డాక్టర్

BHNG: భువనగిరి మండలం తాజ్ పూర్‌కు చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె పరిస్థితి చూసి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా సామాజికవేత్త డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి చేయూతనిచ్చారు. ఆ ఇంటిని శనివారం రంజాన్ సందర్బంగా గృహప్రవేశం చేయించారు.

March 22, 2026 / 06:50 AM IST

కార్యకర్త ఇంట్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: పట్టణ కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ నివాసంలో శనివారం రాత్రి రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లిం ప్రజలకు పవిత్రమైన నెల అని అన్నారు. అల్లా దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 06:48 AM IST

ఎస్ఎల్బిసి సోరంగం పనులు పునః ప్రారంభం

NGKL: ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో పనులు ప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్ లెట్ వైపు సొరంగం పనులు ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 22న ఇన్ లెట్ పనుల్లో 13.95 కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పుకూలి ప్రమాదం చోటు చేసుకుంది.

March 22, 2026 / 06:48 AM IST

గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా సాగుతుంది: కలెక్టర్

ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్‌లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

March 22, 2026 / 06:47 AM IST

మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలివే..

MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో క్యాతన పల్లిలోని పలు వార్డ్‌లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం 10 గంటలకు మందమర్రిలో రూ. 2.31 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

March 22, 2026 / 06:46 AM IST

నేడు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

SDPT: నంగునూరు (M) నర్మెటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్ కలిసి హెలిప్యాడ్, సభాప్రాంగణం, 150 స్టాళ్లను పరిశీలించారు.

March 22, 2026 / 06:44 AM IST