NRML: సారంగాపూర్ మండలం కౌట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు శనివారం కరుణాకర్ రెడ్డి 15వేలు విలువచేసే సౌండ్ సిస్టంను అందజేశారు. అదేవిధంగా పాఠశాల కొరకు బ్యాండ్, విద్యార్థుల బహుమతులకు పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు. ఇందులో బీజేపీ మండల అధ్యక్షుడు విలాస్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు నిజాయితీ పరులకు, మంచివారిని గుర్తించి ఓటు వేయాలన్నారు. సామాజిక సేవకై ముందున్న నాయకులను, ఏమి ఆశించకుండా నిరంతరం ప్రజలకు సేవ చేసే నాయకులను గుర్తించి ఓటు వేయండి అని తెలిపారు.
NRPT: 18 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ దానిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
WGL: తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్రావు ఈ రోజు ఉదయం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా టీజీ క్యాబ్ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీనీ డైరెక్టర్లతో కలిసి నరేందర్ రెడ్డికి ఛైర్మన్ అందజేశారు. బ్యాంకు ద్వారా రైతులకు ఉపయోగపడేలా లోన్లు ఇచ్చి, వారిని ఆదుకోవాలని సూచించారు.
HYD: బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11:30 గంటలకు బర్కత్పూరా చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే తిరంగా ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను ప్రదర్శించనున్నారు.
మేడ్చల్: మరణంలోనూ అవయవదానం చేసి ఆ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. మల్కాజిగిరికి చెందిన మనోజ్ కుమారుడు వంశీ (24) అమెజాన్లో ఉద్యోగి, ఈనెల 23న కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. దుఃఖంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు అతని నేత్రాలు, కిడ్నీలు దానం చేశారు.
ADB: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు.
HYD: నగరంలో మిడ్నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు ఆకతాయిలు చేసే స్టంట్లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు.
MDK: పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని 23వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్, మండల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
JGL: కరీంనగర్ స్మార్ట్ సిటీ, 24గంటల తాగునీటి పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మంత్రికి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ను కలిశారు.
JGL: జగిత్యాల రూరల్ మండలంలోని అంబారీపేట్ గ్రామంలో అర్బన్ పార్క్ను మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి, కలెక్టర్ సత్య ప్రసాద్లు శుక్రవారం ప్రారంభించారు. అలాగే పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ను, క్లాక్ టవర్ను సైతం ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్డిఓ, స్థానిక MLA, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
KMM: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 27వ తేదీన నిర్వహించబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుండెపంగు మల్లేష్ పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు 27న వంటలు బంద్ చేసి, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
KMM: బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు.
MNCL: జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్లో ములుగు అటవీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఇందన్ పల్లి రేంజ్ పరిధిలోని మైసమ్మకుంట, గనిశెట్టి కుంటలలో పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణులు, పక్షుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్, ప్రొ. శాలిని ఉన్నారు.
HYD: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీఐ లంచం డబ్బులు తీసుకుంటూ హైదరాబాద్లోని షాహినాయత్గంజ్ సీఐ బాలు చౌహన్ ఏసీబీకి చిక్కాడు. మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. డిమాండ్ చేసిన డబ్బులో రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.