ADB: నేరడిగొండ మండల కేంద్రంలో హోలీ సంబరాలను శుక్రవారం ఉదయం నుంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సామరస్య పూర్వకంగా ఘనంగా నిర్వహించుకోవాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
MNCL: రామకృష్ణాపూర్ పట్టణం ఆర్కే-1 మార్కెట్లో ఉన్న 38 నెంబర్ గల రేషన్ దుకాణంలో ఉండాల్సిన నిలువల కన్నా మూడున్నర క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు.. జిల్లా పౌరసరఫరాధికారి బ్రహ్మారావు తనిఖీ చేసి గుర్తించారు. ఈ మేరకు సదరు డీలర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో ఏసీ ఎస్ఓ వేణుగోపాల్, ఆర్ఎ భూమేష్ తదితరులు ఉన్నారు.
JN: జిల్లాలో సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ఘనపూర్ (స్టేషన్) పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కల్సి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా మిర్చి తరలివచ్చింది. ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. తేజ మిర్చి క్వింటాకు ₹13,400 (నిన్న ₹13,500) 341 రకం మిర్చి క్వింటాకు ₹13,100 (నిన్న ₹13,000) వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు ₹16,500 (స్థిరంగా కొనసాగుతోంది) అని అధికారులు తెలిపారు.
HYD: ధూమపానం వీడితే వాళ్లే నిజమైన జీవిత విజేతలు అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహాశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మార్చి 12వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాచిగూడలో మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ADB: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డిని పీఆర్టీయూటీఎస్ ADB జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లాధ్యక్షుడు కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి, నాయకులు రాజు, ఈశ్వర్, రవి, తదితరులున్నారు.
MNCL: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దండేపల్లి మండల కేంద్రంలో నిరసన తలపెట్టిన నేపథ్యంలో మంచిర్యాలలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్, నాయకులు అశోక్ వర్ధన్, ముదాం మల్లేష్, రాజు, రాకేశ్ రేణ్వాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ADB: అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరిన సర్పంచుల సంఘం మాజీ జిల్లాధ్యక్షుడు తిరుమల్ గౌడ్ను పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. MLA అనిల్ జాదవ్ ఆదేశానుసారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరనున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని అన్నారు.
BDK: నకిలీ మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ఫామ్ రైతులు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డికి, ఇంఛార్జ్ డీ.ఓ నాయుడు రాధా క్రిష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఆయిల్ఫామ్ తోటలు నాటిన వాటిల్లో దాదాపుగా 50 శాతం పైగా కాపు రాలేదని తెలిపారు.
KNR: జిల్లాలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడు రోజుల బంద్కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్ఫోర్ట్ ధర పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేకపోతున్నామన్నారు. ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నామన్నారు.
JGL: ఎండపల్లి(M) పాతగూడూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి అండర్-14 విభాగంలో పాతగూడూర్కు చెందిన విద్యార్థులు సిహెచ్. సంజన, వై. రేఖ, సిహెచ్. వైష్ణవిలు గోల్డ్ మెడల్ సాధించారు. కరాటే మాస్టర్ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను మంగళవారం అభినందించారు.
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ చూపారు. వ్యక్తిగత విభాగంలో దీక్షిక నేహా ద్వితీయ బహుమతి, అలాగే సామూహిక విభాగంలో అక్షయ్, దివిజేంద్రలకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ శ్రీనివాస్ చౌదరి సైన్స్ అధ్యాపకులు ప్రశంసించారు.
NRPT: ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే రైతు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ రైతు తన నాలుగు ఎకరాలలో వరి పంట వేయగా ఎకరం వరకు సాగు నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుందని రైతు వాపోయాడు.
MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో కంపెనీలతో వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఓ కంపెనీ పొగతో 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.
NGKL: దేశ ప్రగతి యువతతోనే సాధ్యపడుతుందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యువత అభివృద్దే లక్ష్యంగా విక్షిత్ భారత్ కొనసాగుతుందన్నారు. యువత చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు.