ADB: జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల భక్తులు జైనూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 11 రోజుల మాల దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆలయ పురోహితుడు పండిత్ కులకర్ణి మహారాజ్ మాలాధారణ చేస్తూ దీక్ష ప్రారంభించారు. భక్తులు “జై హనుమాన్, జై శ్రీరామ్” అంటూ ఉత్సాహభరితంగా భక్తి భావాన్ని చాటుకున్నారు.
JGL: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల బొంకూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తెలుసుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈనెల 23 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
HYD: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదని HYD ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులన్నారు. కనీసం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, అసెంబ్లీలో ప్రస్తావించకపోవడంపై ఆగ్రహించారు. ఇది ఇలాగే కొనసాగితే, రాబోయే కొద్ది రోజుల్లోనే నిరుద్యోగ ఉద్యమం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మండల అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బిక్షపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్పై నాయకులు తీవ్రవిమర్శలు చేశారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి, 2026-27బడ్జెట్లో వాటి అమలుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అన్నివర్గాలను నిరాశపరిచేలా బడ్జెట్ ఉందని తెలిపారు.
PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ స్పందన ధర్మారం ఎండపల్లి బైపాస్ రోడ్డు మార్గంలో బైక్పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకుంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సతీష్ కలిసి ఎంక్వయిరీ చేపట్టి, కొత్తపల్లిలో ఓ వ్యక్తి వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించి, గంట సమయం లోపు బాధితురాలికి అప్పగించారు.
SRCL: చందుర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ కుమారుడు గొట్టె అనిరుద్ రచించిన “ది హ్యూమన్ ఆర్ట్” పుస్తకాన్ని వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. మూడు భాషల్లో రచించిన ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనిరుద్ వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే తన ఖాళీ సమయాల్లో రచనా కొనసాగించారన్నారు.
BDK: అశ్వాపురం మండలం బుడుగు బజార్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు. రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
SRD: జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 34.4 డిగ్రీలు, గుమ్మడిదలలో 33.2 డిగ్రీలు, అమీన్పూర్లో 33.7 డిగ్రీలు, రామచంద్రాపురంలో 33.7 డిగ్రీలు, పటాన్చెరులో 34.1 ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, గాలిలో తేమశాతం 43.4గా నమోదయింది.
KMM: జిల్లాలో రూ.594 కోట్ల వ్యయంతో 100.82 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరా-జగ్గయ్యపేట, మధిర, బోనకల్ వంటి కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ మోడల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపడి జిల్లా రూపురేఖలను మార్చేలా కీలక రహదారుల విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది.
KNR: భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఎస్ఎఫ్ఏ, డీవైఎఫ్ఎ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘టూకే రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1976 లో నిర్మించిన సీతారాముల దేవాలయం ఈ సంవత్సరం 50వ అర్థశతాబ్ది వేడుకలకు శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబవుతోంది. పూర్వంలో గ్రామ పెద్దల సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దాతల విరాళాలతో కళ్యాణం, అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు.
KMR: పిట్లం ఆర్యవైశ్య మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం “ఛలో భాగ్యనగర్” కార్యక్రమానికి పిలుపునిస్తూ ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. సమాజ అభివృద్ధికి ఐక్యతే బలమని, ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాలని వారు పేర్కొన్నారు.
NLG: నకిరేకల్ మండలంలోని గుట్ట మాజీ ఛైర్మన్ యానాల మల్లారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
వనపర్తి మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులను మున్సిపాలిటీ గుర్తింపు ఉన్న సిబ్బందికి మాత్రమే చెల్లించి ఆన్లైన్లో రశీదు పొందాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు చెల్లించవచ్చన్నారు. గడువు తేది లోపు చెల్లించాలని అన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మనదేతల సన్నిధికి నేడు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం నేడు ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగులో స్నానం ఆచరించి, సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లనున దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న చెట్ల కింద గడుపుతూ వనభోజనాలు చేస్తున్నారు.