• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

KMM: బోనకల్లోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట భవనంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్ 95వ వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాల చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని అని వారు అన్నారు.

March 22, 2026 / 01:49 PM IST

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కడియం

JN: లింగాలగణపురం మండలంలోని చిట్టచివరి గ్రామం రామచంద్రగూడెం గ్రామ చెరువుకి మొట్టమొదటి సారీగా గోదావరి జలాలు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, రైతులకు పంటల సాగుకు నీటిని అందించేలా చర్యలు చూసుకుంటున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 22, 2026 / 01:47 PM IST

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవిలాల్ తండాకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు లావుడ్య మంగమ్మ – రాములు ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోసే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక వర్ధన్నపేట MLA కే.ఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు.

March 22, 2026 / 01:43 PM IST

108 ఆలయాలకు అయోధ్య రామయ్య పట్టు వస్త్రాల పంపిణీ

KNR: సనాతన ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో 108 ఆలయాల అర్చకులకు అయోధ్యలో పూజలు చేసిన పట్టు వస్త్రాలను అందజేశారు. పాకాల రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

March 22, 2026 / 01:38 PM IST

పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: MLA

MHBD: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ.16,94,000 విలువైన చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

March 22, 2026 / 01:38 PM IST

సిమ్ బైండింగ్ అంటే ఏంటో తెలుసా..?

HYD: సిమ్ బైండింగ్ అంటే ఏంటో తెలుసా..? మన సిమ్ మొబైల్లో లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజెస్ ఆప్స్ పనిచేయవు. తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ మన మొబైల్లో ఉండాలి. సిమ్ బైండింగ్ అధికారికంగా 2026 మార్చి 1 నుంచి ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం గత పద్ధతి కొనసాగుతోంది. త్వరలో అందరికీ సిమ్ బైండింగ్ అందుబాటులోకి రానుందని HYD సైబర్ పోలీసులు తెలిపారు.

March 22, 2026 / 01:36 PM IST

‘రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం’

SRD: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. మల్కాపూర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీలకు 25 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ పాల్గొన్నారు.

March 22, 2026 / 01:36 PM IST

ఒకే డివిజన్.. ముగ్గురు కార్పొరేటర్లు..!

MBNR: మహబూబ్ నగర్ 23వ డివిజన్ సొసైటీ పరిధిలో వింత పరిస్థితి నెలకొంది. ఓటర్ల జాబితాలో తప్పుల వల్ల ఈ డివిజన్ ఓట్లు 8, 23, 24 డివిజన్లలోకి వెళ్లాయి. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సొసైటీ ప్రజలు ఆ మూడు డివిజన్ల కార్పొరేటర్లను ఆహ్వానించి సన్మానం చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం ముగ్గురు కార్పొరేటర్లు కలిసి పనిచేయాలని స్థానికులు కోరారు.

March 22, 2026 / 01:36 PM IST

సిద్ధాంత నిబద్ధతే బీజేపీ విజయ రహస్యం: శ్రీవర్ధన్ రెడ్డి

RR: తుర్కయాంజల్‌లో బీజేపీ ఎదుగుదలకు క్రమశిక్షణ, సేవా భావమే మూలమని పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణలో ఆయన ప్రసంగించారు. అంత్యోదయ భావనతో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరడమే లక్ష్యమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 01:32 PM IST

‘లైసెన్సుడ్ సర్వేయర్ల కార్యవర్గం ఎన్నిక’

PDPL: జిల్లా లైసెన్సుడు సర్వేయర్స్ అసోసియేషన్ సమావేశాన్ని ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాతూరి అనిల్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల తిరుపతి, ఉపాధ్యక్షులుగా ఎండి జుబీర్, బూర్ల సురేష్, కోశాధికారిగా సాన కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీకి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

March 22, 2026 / 01:32 PM IST

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చైర్మన్

HNK: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ, ఓ-సిటి, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొని స్వయంగా చెత్తను తొలగించారు. ఓరుగల్లు నగరాన్ని పరిశుభ్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

March 22, 2026 / 01:31 PM IST

రాములోరి కళ్యాణానికి రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్య క్రమానికి రావాలని ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

March 22, 2026 / 01:30 PM IST

బ్యాంకు ఉద్యోగికి ఘనంగా సన్మానం

NRML: బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన నిహాల్ కెనరా బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎంప్లాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సాయినాథ్, తదితరులు పాల్గొని అభినందించారు. నిహాల్ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 22, 2026 / 01:30 PM IST

‘అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

ADB: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఆదివారం పూటూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికి కార్యక్రమ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నాటికి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

March 22, 2026 / 01:30 PM IST

‘హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’

MNCL: హైదారాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదిరింపులు, బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని కోరారు.

March 22, 2026 / 01:30 PM IST