• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘నాగోబా దేవాలయాన్ని దర్శించుకున్న కలెక్టర్’

ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నెలకొన్న నాగోబా దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాంతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

January 24, 2025 / 01:18 PM IST

‘కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేత’

ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కైలాష్ నగర్‌లో గల న్యూ అంబేద్కర్ భవనం ఎదురుగా ఉన్నటువంటి పాత బిల్డింగ్‌ని సీనియర్ సిటిజన్లకు కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.

January 24, 2025 / 01:09 PM IST

కెనాల్ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ పట్టణం పెద్ద చెరువు దగ్గర నిర్మాణం చేపట్టిన స్టామ్ వాటర్ కెనాల్ పనులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి, పరిశీలించారు. అలాగే, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

January 24, 2025 / 01:04 PM IST

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

MNCL: పోరాటాలతోనే నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని జన్నారం మండల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కస్తూలాపురి నాగేందర్ సూచించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలో నాయి బ్రాహ్మణ, బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘంల ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

January 24, 2025 / 12:56 PM IST

ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం: ఎమ్మెల్యే

WNP: ఆర్టీసీ బస్సులోనే ప్రజలకు సురక్షిత ప్రయాణం ఉంటుందని ఎమ్మెల్యే మెఘారెడ్డి అన్నారు. శుక్రవారం డ్రైవర్స్‌డే సందర్భంగా వనపర్తి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రూపొందించిన రోడ్డు ప్రమాదాల నివారణ బ్యానర్‌పై ఎమ్మెల్యే సంతకంచేసి, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

January 24, 2025 / 12:45 PM IST

క్రీడలతో మానసిక వికాసానికి దోహదం: ఎమ్మెల్యే

MBNR: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు.

January 24, 2025 / 12:36 PM IST

పాఠశాలలో ఫిజియోథెరపీ చికిత్సలు

MDK: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజియోథెరపిస్ట్ అరుణ్ కుమార్ శుక్రవారం ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. పిల్లల వ్యాయామాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వ్యాయామాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రాజ్, కాంప్లెక్స్ సిఆర్పి శంకర్ గౌడ్, ఐఆర్పీలు సునీల్, సాయిలు ఉన్నారు.

January 24, 2025 / 12:13 PM IST

అపార్ గుర్తింపుకు చివరి తేదీ 30

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా అపార్ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నామని మండల విద్యా ధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం అపార్ రూపొందించిందన్నారు. అపార్ అంటే ఆటోమెటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఇందులో ఒక విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు.

January 24, 2025 / 11:03 AM IST

సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం

SRD: గుమ్మడిదల మండల కేంద్రంలో దళితవాడలో పీఎం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గుమ్మడిదల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావలి ఐలయ్య ఆధ్వర్యంలో “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఇందులో భాగంగా గడపగడపకు వెళ్లి భారత రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు గౌడ్, రాంరెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి ఉదయ్ కుమార్ ఉన్నారు.

January 24, 2025 / 11:02 AM IST

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

మెదక్: తూప్రాన్ మున్సిపాలిటీలోని జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయాదేవి ఆకస్మిక తనిఖీ చేశరు. రాత్రి గురుకుల పాఠశాలలోనే బస చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

January 24, 2025 / 09:47 AM IST

‘ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలి’

SRD: ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలని ఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున డిపోలో డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. నేడు డ్రైవర్స్ డే సందర్భంగా వారికి గులాబీ పూలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులోనే సుఖవంతమైన ప్రయాణమని ప్రజలకు గట్టి నమ్మకం ఉందన్నారు.

January 24, 2025 / 09:29 AM IST

మహిళా అదృశ్యం కేసు నమోదు

SRD: మహిళ అదృశ్యమైన ఘటన నిజాంపేట్ మండల పరిధిలోని నాగ్దర్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్హేర్ ఎస్సై వెంక టేశం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మి (53) 20వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లింది..ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధు వులు, చుట్టు ప్రక్కల ప్రాంతాలల్లో వెతికిన ఆచూకీ దొరకలేదు. కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

January 24, 2025 / 09:11 AM IST

గంధోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట సయ్యద్ హజర్ షా దర్గలో గురువారం సాయంత్రం నిర్వహించిన గంధోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు, పర్వదినాలు జరుపుకోవాలని సూచించారు.

January 24, 2025 / 08:41 AM IST

బీసీ రాజకీయ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ

HNK: జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న జరుగు బీసీ రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలని కోరుతూ నేడు హనుమకొండలో బీసీ సంఘాల నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు భయ్యా స్వామి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నాయకులు సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు.

January 24, 2025 / 08:14 AM IST

మీ వాహనాలు తీసుకెళ్లండి.. లేదంటే వేలం వేస్తాం: సీపీ

SDPT: జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను తీసుకువెళ్లాలని సీపీ అనురాధ సూచించారు. అన్నోన్ ప్రాపర్టీ కింద సిద్దిపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో మోటార్ సైకిళ్లు 172, ఆటోలు 2, ఫోర్ విల్లర్స్ 3.. మొత్తం 177 వాహనాలపై జిల్లాలోని పోలీసు స్టేషన్లలో 106 BNSSలో కేసులు నమోదు చేశామని తెలిపారు.

January 24, 2025 / 08:13 AM IST