• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిధుల మంజూరుకు హర్షం

MDK: నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్ కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు సహకరించిన ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.

March 11, 2025 / 05:29 PM IST

కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

SRD: ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. కార్మికులను అకారణంగా తొలగించడం అన్యాయమని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ ఇంచార్జ్ ఏవో దశరథ్‌కు వినతిపత్రం సమర్పించారు.

March 11, 2025 / 05:24 PM IST

ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు

మేడ్చల్: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ సీటు సాధించిన వారికి ఫీజు చెల్లించడం అభినదనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా 13 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ. 5 లక్షల 21 వేల రూపాయల చెక్కుల పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న బండారి లక్ష్మారెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

March 11, 2025 / 05:24 PM IST

డంపు యార్డ్ హటావో.. నర్సాపూర్ బచావో: మల్లేష్ గౌడ్

MDK: డంపు యార్డును వ్యతిరేకిస్తూ చేపడుతున్న దీక్షలు నేడు 23వ రోజుకు చేరుకున్నాయి. ప్యారానగర్ నిర్మిస్తున్న డంప్ యార్డును వెంటనే విరమించుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డంప్ యార్డు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రజలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

March 11, 2025 / 05:18 PM IST

రైతులతో విద్యుత్ అధికారుల ముఖాముఖి

SRD: కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్ గ్రామంలో విద్యుత్ ఎస్ఈ శ్రీనాథ్ రైతుల పొలాల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాపై రైతులతో ముఖాముఖిగా చర్చించి కరెంటు సమస్యలపై మంగళవారం ఆరా తీశారు. వ్యవసాయ పంటలకు కరెంటు ఏ సమస్య లేకుండా అందుతుందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నందకుమార్, ఈ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

March 11, 2025 / 05:16 PM IST

‘మాదిగలకు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలి’

RR: నిండు అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంఆర్‌పీఎస్ నిరసన దీక్షలు చేపట్టారు. ఉద్యోగ నియామకాలలో మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

March 11, 2025 / 04:28 PM IST

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

మేడ్చల్: ఉప్పల్ సర్కిల్-2 లోని రామంతాపూర్, ఇందిరానగర్, లక్ష్మారెడ్డి కాలనీ, స్వరూప్ నగర్, పద్మావతి కాలనీ, సత్యానగర్, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో రూ. 41 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి పాల్గొన్నారు.

March 11, 2025 / 04:24 PM IST

హైస్కూల్లో తరగతి గదులు ప్రారంభం

RR: నార్సింగి మున్సిపల్ పరిధిలోని నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్లో 81 లక్షల పీఎం శ్రీ నిధుల ద్వారా నిర్మించిన 6 తరగతి గదులు, 1.43 లక్షల AWP నిధుల ద్వారా నిర్మించిన 11 తరగతి గదులను ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

March 11, 2025 / 04:20 PM IST

స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలి

RR: ఫంక్షన్‌లకు స్కూల్ బస్సులు అద్దెకు ఇవ్వడంపై చేవెళ్ళ షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలకు చెందిన ప్రవేట్ ట్రావెల్స్ యజమానులు ఈరోజు జిల్లా DTO, RTOలకు వినతి పత్రం అందింజేశారు. స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన రవాణా శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 11, 2025 / 04:18 PM IST

ఘనంగా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

VKB: పరిగి పట్టణంలోని శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి-ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజ హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.

March 11, 2025 / 04:15 PM IST

నేడు, రేపు ఉచిత వైద్య శిబిరం

NRML: నిర్మల్ కలెక్టరేట్‌లో మంగళవారం, బుధవారం జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డీపీఆర్వో విష్ణు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరం ఉంటుందన్నారు.

March 11, 2025 / 01:41 PM IST

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

NRML: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి ఎంపీడీవో కార్యాలయాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళకు ఆయన భూమి పూజ చేశారు.

March 11, 2025 / 01:35 PM IST

గంగారం మృతి పట్ల మంత్రి సురేఖ విచారం

WGL: తెలంగాణ సెక్రటేరియట్ మాజీ సీఎస్‌వో, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ టి.గంగారాం మృతి పట్ల మంత్రి సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణంపై మంత్రి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కమాండెంట్ గంగారాం ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని అన్నారు.

March 11, 2025 / 01:35 PM IST

బాధితుడిని పరామర్శించిన ఆత్రం సుగుణ

ASF: సిర్పూర్(యు)లోని దేవులపల్లి గ్రామానికి చెందిన ఆత్రం శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని వెల్నెస్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా మెరుగైన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంఛార్జ్ ఆత్రం సుగుణ మంగళవారం ఆస్పత్రికి చేరుకొని శ్రీకాంత్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

March 11, 2025 / 01:30 PM IST

నారీ శక్తి పురస్కారాలు ప్రధానం

MNCL: జిల్లా కేంద్రంలో మంగళవారం టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలకు నారీ శక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు సునార్కర్ రాంబాబు, పుడ్ కార్పొరేషన్ సభ్యుడు డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ పాల్గొన్నారు.

March 11, 2025 / 01:05 PM IST