ASF: సిర్పూర్(యు)లోని దేవులపల్లి గ్రామానికి చెందిన ఆత్రం శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని వెల్నెస్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా మెరుగైన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంఛార్జ్ ఆత్రం సుగుణ మంగళవారం ఆస్పత్రికి చేరుకొని శ్రీకాంత్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.