KNR: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలకు గ్రామ ప్రత్యేకాధికారి, తహశీల్దార్ వి. శ్రీనివాస్ రెడ్డి గురువారం యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి ప్రభుత్వం అందజేస్తున్న పౌషికారమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని కోరారు.
MNCL: జైపూర్లోని పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గూడూరు అజయ్ను గురువారం కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. విధుల్లో భాగంగా భోజన సమయంలో తన బైక్పై బయటకు వస్తున్న క్రమంలో ఎస్ ఈ ప్రసాద్ అనే సింగరేణి అధికారి కారు అజయ్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అజయ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామ శివారులో గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
NRML: నిర్మల్లోని ప్రసిద్ధ దర్గా హజరత్ మహమ్మద్ అబ్దుల్ అజీజ్ బాబా (వడూర్ బాబా) రహమత్ అలై ఉర్సు ఉత్సవాలు గురువారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు అబ్దుల్ జబ్బర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటలకు గంధం శోభయాత్ర నిర్వహించి హజ్రత్ వారి స్మృతి సమాధిపై పూలు చాదర్లు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు.
NRPT: మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. అనంతరం గోదాంలను పరిశీలించారు. రైతుల పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాంలు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.
నిర్మల్: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మెడికల్ యాజమానులు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పె క్టర్ శ్యాంసుందర్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలలో తనిఖీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ డ్రగ్స్, కాస్మోటిక్ 1945చట్టం ప్రకారం నిబంధనలు పాటించని మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీచేశామని అన్నారు.
WNP: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరక్టర్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కేడీఆర్ నగర్లో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని కిచెన్ను పరిశీలించారు. వంట సామాగ్రి నిల్వకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
KMR: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో గురువారం గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఖాళీ స్థలాలను ఉన్న వారు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబితాలో పేర్లు లేని వారందరి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
MBNR: మహబూబ్నగర్ ఎంపీ కార్యాలయంలో నూతనంగా జడ్చర్ల పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడ్ల అమర్నాథ్ గౌడ్ గురువారం ఎంపీ డీకే అరుణను కలిసి సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NRML: దూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు యోగేష్ కుమార్ శర్మ అన్నారు. గురువారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి అర్చకులకు వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో గురువారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,110గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.90 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
WNP: అమరచింత మున్సిపాలిటీలోని 2వ వార్డ్ కౌన్సిలర్ లావణ్యకు డాక్టర్ పట్టా లభించింది. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ఎ పూర్తి చేసిన లావణ్యను ప్రొఫెసర్లు గేశ్వరరావు, అనురాధ హైదరాబాద్లో అభినందించారు. డాక్టర్ పట్టా పొందిన లావణ్యకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
NLG: శాలిగౌరారం మండలం ఉప్పలంచ మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఉప్పలంచలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి తెలిపారు. ముందుగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లయ్య అంత్యక్రియలో పాల్గొనాలని కోరారు.
KMR: లింగాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ (బజరంగ్ దళ్) ఆధ్వర్యంలో అయోధ్యలో బాల రామయ్యను ప్రతిష్టించి నేటికీ సంవత్సరం పూర్తైన సందర్భంగా స్వామి వారి దేవస్థానంలో అయోధ్య రామయ్య చిత్ర పటం వేసి దీపాలతో వెలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. తాటి పాముల సంగీత, రాజు, సంజీత్ ఉన్నారు.
KMR: జిల్లాలో ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు బీజం పడింది. రాష్ట్ర ప్రభుత్వం దాహొస్ జరిగిన సదస్సులో జిల్లాలో రూ.10 కోట్లతో ఆయిల్ ఫామ్ ఏర్పాటు చేసి నూనె శుద్ధికరణ కేంద్రాన్ని నిర్మించడం కోసం దాహోస్ జరిగిన సదస్సులో సీఎం రేవంత్రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒప్పందం చేసుకొన్నారు. జిల్లాలోని పామ్ ఏర్పాటుతో 4వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.