HYD: గవర్నర్ నేడు ఉదయం 8గంటలకు ములుగు వెళ్తుండడంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోకుండా ఉదయం 8:30నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
KMR: కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీలో కొందరు పారిశుధ్య కార్మికులు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారని, ఈ విషయమై మార్పు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల కార్మికులు, యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు నిబద్ధతతో పని చేయాలి అన్నారు.
KMR: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.
NZB: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్లోని AITUC కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభలో ముందుగా రైతు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు చేస్తుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.
NLG: నార్కట్ పల్లి మండలం ఏపి లింగోటం గ్రామంలో, యాదవ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.
NLG: విద్యార్థినిలు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
BHNG: పోచంపల్లి మండలం నారాయణగిరి నుంచి దేషముఖి (వయా గోసుగుండు) రోడ్డుకు, నారాయణగిరి మోడల్ స్కూల్ వద్ద సోమవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన జగత్పల్లి నుంచి జంగంవారిగూడెం రోడ్డుకు జగత్పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
WGL: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలో తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి, పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలన్నారు.
WGL: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు.
MHBD: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి బోడ రాజు నాయక్ కి గతరాత్రి 11 గంటలకు తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పాము కాటు వేసింది. దీంతో పట్టణంలోని ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
SRD: కంగ్టి మండల జమ్గి కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకర్ కుటుంబీకులకు జిల్లా కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ శంకర్ భార్య అవుసుల శ్యామవ్వ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీవ్ర సంతపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
ADB: ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ భీమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు.
SRPT: జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ జగదాంబ దేవి, సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారని గ్రామస్తులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.