MNCL: మల్టీ లెవెల్ స్కీమ్స్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
NRML: అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వార్డు సభల్లో భాగంగా బుధవారం పట్టణంలో ఆస్రా కాలనీలో నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొని రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు వివిధ రకాల దరఖాస్తుదారుల దరఖాస్తులను పరిశీలించారు.
NRML: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఖానాపూర్ పట్టణంలోని 6, 7, 8 వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు.
గద్వాల: జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డులకు సంబంధించిన వార్డుల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.
NRPT: నారాయణపేట నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను MLA చిట్టెం పర్ణిక రెడ్డి బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ADB: ఆదివాసులకు ఆరాధ్య దైవం నాగోబా కొలువై ఉన్న కేస్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రూ.13 కోట్లు ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సచివాలయంలో సీఎస్తో సమావేశమై పలు అంశాలను చర్చించారు. తాము విన్నవించిన సమస్యలను పరిష్కరించాలన్నారు.
వనపర్తి: డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభించిందని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లైసెన్స్ మేళాలో 57 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
MBNR: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం కొయిలకొండ మండలం గర్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను, సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం పోలీసులు డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన సందర్భంగా మరికల్ నుంచి మక్తల్ వరకు కల్వర్టలు, ముఖ్య కూడలిలో డాగ్ స్క్వాయిడ్ తనిఖీలు నిర్వహించినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలను ఎస్సై రాము పరిశీలించారు.
NRML: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 357.70 అడుగులు ఉందన్నారు. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఎలాంటి వరద ప్రవాహం లేదని తెలిపారు. కెనల్కు 60 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 20 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు.
NRML: నిర్మల్-బైంసా జాతీయ రహదారిపై ఉన్న దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి బస్సుల కొరకు వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తాత్కాలిక ప్రయాణ ప్రాంగణం ఏర్పాటుచేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని బుధవారం పలువురు కోరారు.
HYD: నగరంలోని రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అధునాతన సాంకేతిక హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు 200 కిలోమీటర్లు పొడవు ఉండనుంది. ఇందులో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంకి ఒకటి చొప్పున 4 నుంచి 5 టోల్ ప్లాజాలు వస్తాయని అధికారులు వెల్లడించారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకునికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డితో కలిసితోపాటు ఎమ్మెల్యే పాల్గొంటారని పాలకుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
WGL: సీకేఎం కళాశాల మైదానంలో నేడు వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. రిజర్వేషన్లలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వాకర్స్కి తీన్మార్ మల్లన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ఆయన మాట్లాడుతూ..ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధభేరి హలో బీసీ ఛలో వరంగల్ సభను విజయవంతం చేయాలన్నారు.