HNK: జులైవాడ సర్కిల్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై వెళ్తున్న వేల్పుల రజిత (39)ను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తల, దవడ భాగాల్లో బలమైన గాయాలవ్వడంతో ముక్కు, నోటి నుంచి భారీగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
BHPL: మహాముత్తారం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో జిల్లాలోని గొత్తికోయ గిరిజనుల కొరకు ఈ నెల 25వ తేదీన ఉచిత పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు SP సంకీర్త్ తెలిపారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల నుంచి సుమారు 30 మంది వైద్యులు సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ADB: ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నిమ్మల సుప్రియతో కలిసి రూ.39 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రాథమిక వసతులు అందరికీ చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణంలో రెడ్డి చెరువు హనుమాన్ ఆలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. స్థానిక కౌన్సిలర్ కొడిగెల మల్లయ్య మాట్లాడుతూ.. స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఆలయాన్ని కాపాడుకోవాలన్నారు.
NRML: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లాల భూగర్భజలాల స్థితి ప్రాధాన్యత పొందింది. ఆదిలాబాద్లో 563.45లో 206.16 వినియోగం, 304.04 మిగులు ఉంది. కుమురంభీంలో 567.91లో 118.95 వినియోగంతో 448.96 మిగిలింది. మంచిర్యాలలో 882.58లో 369.12 వినియోగం, 573.46 మిగులు ఉంది. నిర్మల్లో 681.60లో, 255.68 వినియోగంతో 425.92 మిగిలింది. నీటి సంరక్షణ అత్యవసరమని అధికారులు తెలిపారు.
SDPT: ‘రైతు భరోసా పథకం’ కింద ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం తమ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో చెల్లింపులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రూ.3,590 కోట్లతో లక్షలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ బలోపేతం, రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన కట్టుబాటుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ శివారులో ఉన్న గోదావరి వంతెన సమీపంలోని అత్తమడుగు తరిగిపోని జలసిరిగా పేరు తెచ్చుకుంది. వర్షాకాలంలో వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వేసవికాలంలో నీటి ప్రవాహం లేక చిన్నపాయగా కనిపిస్తుంది. కానీ నది సమీపంలో ఉన్న అత్తమడుగు ప్రాంతం పూర్తి నీటితో కళకళలాడుతూ తీవ్రమైన ఎండల్లో సైతం జీవాలకు నీటిని అందిస్తుంది.
NRPT: మాగనూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠ నెలకొంది. అనుమానాస్పద కారును పోలీసులు తనిఖీ చేస్తుండగా నిందితుడు తప్పించుకునేందుకు యత్నించాడు. అడ్డుకోబోయిన పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ను తోసేసి చీకట్లో చెట్ల మధ్యగా దూకి పరారయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు.
SRPT: గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ బాధితులను వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
BDK: హైదరాబాద్లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన యువకుడు ధీరజ్ సాయి మృతి చెందాడు. మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్కు చెందిన ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి కుమారుడైన ధీరజ్,ఉన్నత చదువుల నిమిత్తం HYDలో ఉంటున్నాడు. ప్రమాదశాత్తు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కొల్పొయాడు. కొడుకు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కలెక్టరేట్ ముందు ఉన్న టీ స్టాళ్లు, విజయ డైరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ జీవనం సాగిస్తున్న మహిళలు ఆందోళనకు దిగారు. తమ ఉపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ కలెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
MDCL: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఎంపిక చేసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్య అందించనున్నారు. విద్యార్థులకు స్కూల్ బస్సు సౌకర్యంతో పాటు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
MDK: రేగోడ్కి చెందిన యువకుడు రాచోటి నిఖిల్, మాజీ CM KCRపై అభిమానంతో విశిష్ట బైక్ యాత్రను ప్రారంభించాడు. ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్లోని సంఘ టెన్జిన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఢిల్లీ మార్గంగా చైనా సరిహద్దు వరకు చేరుకొని గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ తన అభిమానం చాటుకున్నారు. KCRపై అభిమానంతో 2,155 K.M బైక్ యాత్రను పూర్తి చేశాను.
RR: మైలార్దేవుపల్లిలో డ్రైనేజీ పైప్లైన్ పనులు పూర్తయినా, రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన రహదారులు బురదమయంగా మారి, ప్రజలు నడవడానికి కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప వర్షానికే పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
WGL: వరంగల్ నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరత కారణంగా హోటల్ వ్యాపారం సంక్షోభంలో పడింది. నగరవ్యాప్తంగా 3 వేల చిన్న, పెద్ద హోటల్స్ 500కు పైగా మూతపడ్డాయి. రోజూ 4-5 సిలిండర్లు వాడే హోటల్స్ సరఫరా తగ్గడంతో ధరలు రూ.100 నుంచి 150 పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, వేసవి, పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు.