MHBD: దంతాలపల్లి కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పరిశీలించారు. ఆసుపత్రిలోని ప్రతి రూమ్ తనిఖీ చేసి, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని త్వరలోనే ఆసుపత్రికి స్కానింగ్ సెంటర్ కూడా మంజూరు చేయిస్తానని, స్టాక్ రూమిని పరిశీలించి ఎప్పటికప్పుడు స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
HYD: నగరంలో వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ క్షేత్రస్థాయిలో దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వీటిపై నుంచి రెట్టింపు వేగంతో వెళ్తున్నారని, దీంతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
NRML: బైంసా పట్టణంలోని పాత ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల బుధవారం అందుబాటులో ఉండనున్నారు. నిర్మల్ పోలీసు మీ పోలీసులో భాగంగా ప్రతీ బుధవారం భైంసాలో ఆమె ప్రజావాణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండనున్నారు. డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా సంప్రదించి ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.
HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలను మహాశివరాత్రిలోగా అభివృద్ధి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కూడా అధికారులు రంగంలోకి దిగి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో పనులు చేపట్టి పూర్తి చేస్తామని కూడా డీఈ ప్రకటించారు.
ADB: కేస్లాపూర్లో శేషసాయి అనే భక్తుడు నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్ళాడు. ద్వార పాలకులు శేషసాయిని అడ్డుకోగా, శేషసాయి బాధతో నాగలోక ద్వారాలను తాకాడని, నాగరాజు కోపంతో రగిలిపోయాడనే చరిత్ర ఉంది. పురోహితులు నాగరాజు కోపం చల్లారడానికి 7 రకాల నైవేద్యాలు, గోదావరి జలాలతో అభిషేకించాలని సూచించారు. శేషసాయి అలాగే చేయడంతో నాగరాజు శాంతించాడని చరిత్ర ఉంది.
HYD: గతంలో ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈనెల 24 వరకు జరగనున్న గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
SRCL: రుద్రంగి మండలంలో జరిగే గ్రామ సభకు మంత్రులు వస్తున్న సందర్భంగా కేంద్రంలో హెలిప్యాడ్ అలాగే బహిరంగ సభ ప్రాంగణం కలి కోట సూరమ్మ ప్రాజెక్టు వద్ద పనులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
PDPL: రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం ఎంపీ వంశీకృష్ణ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హాల్లో మంగళవారం నేషనల్ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా టౌన్ సీఐ వీర ప్రసాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. మీ బందువులకు, ఫ్రెండ్స్ తల్లి దండ్రులకు రోడ్డు భద్రత నియమాల గురించి వివరించాలని సీఐ సూచించారు.
SRCL: నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో ఏర్పడిన నాటి నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు. ఇప్పటికే ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. మహా శివరాత్రి జాతర నేపథ్యంలో ముందస్తు పనులలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేపట్టామని టౌన్ సెస్ ఏఈ సిద్దార్థ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని భగవంతరావ్ నగర్, భీమేశ్వర, బద్ది టెంపుల్, పోలీస్ స్టేషన్, అంబేద్కర్ విగ్రహం ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుదని అన్నారు.
SRPT: రాంగ్సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలోని శంకర్ విలాస్ సెంటర్లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. గత నెల రోజులుగా రాంగ్ డ్రైవింగ్ చేస్తున్న 150పైగా వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమాలు వాహన చోదుకులు పాటించాలని అన్నారు.
KNR: రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మట్టి రవాణా కొనసాగుతుంది. యదేచ్చగా మట్టి రవాణాతో అర్ధరాత్రి వేళ, లారీలు, టిప్పర్ల శబ్దంతో ప్రశాంతత కోల్పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
WGL: ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామసభలో ఇంఛార్జ్ ఎంపీడీవో సునీల్ కుమార్- రాజు, స్పెషల్ ఆఫీసర్ సౌజన్య పాల్గొన్నారు. ఈ నెల 26న ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను, పారదర్శకంగా ఎంపిక చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేశామని మండల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
HNK: ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో సర్వేను ప్రైవేటు వ్యక్తులతో తప్పుల తడకగా నిర్వహించారని, అర్హులైన లబ్ధిదారుల పేర్లు లిస్టులో లేవని మంగళవారం గ్రామ పంచాయతీ ఎదుట పలువురు యువకులు నిరసనను వ్యక్తం చేశారు. అర్హులైన వారి పేర్లు లిస్టులో లేకుండా అనర్హుల పేర్లు లిస్టులో ఉన్నాయని, అధికారులు మళ్ళీ సర్వే చేసి అసలైన పేద వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.