• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యాంటీ-నార్కోటిక్ బ్యూరోగా రూపేశ్ బాధ్యతల స్వీకరణ

HYD: తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.

March 11, 2025 / 07:38 AM IST

విమెన్ హెల్ప్ లైన్ సెంటర్‌లో మంత్రి సితక్క

HYD: మంత్రి సీతక్క సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. హెల్ప్ లైన్ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన సీతక్క.. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేసి, బాధితురాలి ఆవేదన విన్నారు. తన భర్త వేధిస్తున్నాడని లలిత అనే మహిళ ఫోన్ చేయగా మాట్లాడారు.

March 11, 2025 / 07:34 AM IST

ఇంటర్ విద్యార్థులకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

HYD: గవర్నర్ నేడు ఉదయం 8గంటలకు ములుగు వెళ్తుండడంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోకుండా ఉదయం 8:30నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2025 / 07:31 AM IST

తాగునీటి ఇబ్బందులను తొలగించాలి

మేడ్చల్: వేసవిలో తలెత్తున్న తాగునీటి ఇబ్బందులను తొలగించాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. బాలానగర్, వినాయకనగర్ డివిజన్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి అధికారులతో చర్చించారు. లో- ఫ్రెషర్ సమయపాలన లేకుండా సరఫరా, లీజేజీలు నివారించాలన్నారు. జలమండలి మేనేజర్లు అనిల్‌కుమార్, సతీశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 11, 2025 / 07:29 AM IST

‘మున్సిపల్ కార్మికులు నిబద్దతతో పని చేయాలి’

KMR: కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీలో కొందరు పారిశుధ్య కార్మికులు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారని, ఈ విషయమై మార్పు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల కార్మికులు, యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు నిబద్ధతతో పని చేయాలి అన్నారు.

March 10, 2025 / 06:29 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలి’

KMR: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.

March 10, 2025 / 06:11 PM IST

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి: ఏఐటీయూసీ

NZB: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్‌లోని AITUC కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభలో ముందుగా రైతు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు చేస్తుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.

March 10, 2025 / 05:56 PM IST

పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

NLG: నార్కట్ పల్లి మండలం ఏపి లింగోటం గ్రామంలో, యాదవ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

March 10, 2025 / 04:49 PM IST

విద్యార్థినిలు బాగా చదవాలి: కలెక్టర్

NLG: విద్యార్థినిలు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

March 10, 2025 / 04:36 PM IST

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BHNG: పోచంపల్లి మండలం నారాయణగిరి నుంచి దేషముఖి (వయా గోసుగుండు) రోడ్డుకు, నారాయణగిరి మోడల్ స్కూల్ వద్ద సోమవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన జగత్‌పల్లి నుంచి జంగంవారిగూడెం రోడ్డుకు జగత్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

March 10, 2025 / 04:19 PM IST

BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి సమీక్ష

WGL: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలో తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి, పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలన్నారు.

March 10, 2025 / 12:56 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్యెల్యే

WGL: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సహకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు.

March 10, 2025 / 12:45 PM IST

పాముకాటుకు గురైన జర్నలిస్టు అసోసియేషన్ ప్రచార కార్యదర్శి

MHBD: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి బోడ రాజు నాయక్ కి గతరాత్రి 11 గంటలకు తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పాము కాటు వేసింది. దీంతో పట్టణంలోని ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

March 10, 2025 / 11:22 AM IST

బాధిత కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్ నేత

SRD: కంగ్టి మండల జమ్గి కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకర్ కుటుంబీకులకు జిల్లా కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ శంకర్ భార్య అవుసుల శ్యామవ్వ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీవ్ర సంతపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

March 10, 2025 / 11:10 AM IST

9వ తరగతి విద్యార్థిని మృతి

ADB: ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ భీమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు.

March 10, 2025 / 10:56 AM IST