• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా ప్రకటించాలి’

SRD: ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు.

March 22, 2026 / 06:02 PM IST

ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు

WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ద్వారకాపేట మెయిన్ రోడ్డుపై ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై తవ్వకాలు జరిపారు.దీంతో పైప్ లైన్ పగిలి నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో మున్సిపల్ ఛైర్మెన్ లక్ష్మీ రామానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన ఎయిర్టెల్ నెట్వర్క్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 22, 2026 / 06:02 PM IST

రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

March 22, 2026 / 06:02 PM IST

ముదిగొండ మహిళకు ‘స్వర్ణ నంది ఉగాది పురస్కారం’

KMM: ముదిగొండ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డాక్టర్ నీరుకొండ ఉషారాణికి స్వర్ణ నంది ఉగాది పురస్కారం లభించింది. ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో మొగిలి & ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఆమెను సత్కరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళా సాధికారత బాలకార్మిక నిర్మూలనకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని ఆమె తెలిపారు.

March 22, 2026 / 06:02 PM IST

‘సామజిక చైతన్యానికి సాహిత్యమే ఊపిరి’

ADB: సామజిక చైతన్యానికి సాహిత్యమే ఊపిరి అని సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలోని చెడును రూపుమాపడానికి కవులు, రచయితలు తమ రచనల ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

March 22, 2026 / 06:01 PM IST

కేటీఆర్‌ను కలిసిన జిల్లా BRSV నేత

నల్గొండ మండల పరిధిలోని జీట్టితల చెన్నారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

March 22, 2026 / 06:01 PM IST

ప్రజావాణి పునఃప్రారంభం: కలెక్టర్

GDWL: గత వారం అనివార్య కారణాలతో ఆగిపోయిన ప్రజావాణి రేపటి నుంచి యథావిధిగా సాగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం (రేపు) గద్వాల కలెక్టరేట్‌లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు.

March 22, 2026 / 05:54 PM IST

మిషన్ భగీరథ నీటినే తాగండి: ఏఈ

MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ దివ్య నీటి నాణ్యతను పరీక్షించి వివరించారు. బోరు, ఆర్వో నీటితో పోలిస్తే మిషన్ భగీరథ నీటిలో అవసరమైన మినరల్స్ సమతుల్యంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు భగీరథ నీటినే వినియోగించాలని సూచించారు.

March 22, 2026 / 05:53 PM IST

ఎమ్మెల్యేను కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ఆయనను సత్కరించారు.

March 22, 2026 / 05:53 PM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సిద్దగోని రవి (52) ఆదివారం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 05:47 PM IST

హాస్టల్ ఎదుట విద్యార్థుల నిరసన

MNCL: నెన్నెల మండలంలోని గిరిజన బాలల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆదివారం హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. తమ సమస్యలపై AISB నాయకులకి చెపితే హాస్టల్ వార్డెన్ బెదిరిస్తున్నారని వాపోయారు. తమకి సరిగ్గా భోజనం పెట్టడం లేదని, సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా భోజనం వండుకుని తింటారన్నారన్నారు. ఆరోగ్యం బాగోలేకుంటే కూడా పట్టించుకోవడం లేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

March 22, 2026 / 05:46 PM IST

రంగాపురంలో ఉచిత వైద్య శిబిరం

WNP: గ్రామ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యము అంతే ముఖ్యమని రంగాపురం సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో అపోలో, సరోజినీ, భారత్ కంటి ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం గ్రామంలోనే పరీక్షలు జరిపించి మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

March 22, 2026 / 05:45 PM IST

‘బడ్జెట్ అంకెల గారడి కాదు, అంకెలనే మార్చడం’

MHBD:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలాగా కాకుండా అంకెలనే మార్చడం లాగా ఉందని మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఇవాళ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ప్రతిఏటా రూ.20వేల కోట్లు బడ్జెట్‌ను ఇస్తామని రూ.33,116 కేటాయించి మోసం చేశారని మండిపడ్డారు.

March 22, 2026 / 05:42 PM IST

బడ్జెట్‌పై మాజీ ఎంపీ విమర్శలు

MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలాగా కాకుండా అంకెలనే మార్చడం లాగా ఉందని మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఇవాళ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ప్రతిఏటా రూ.20వేల కోట్లు బడ్జెట్‌ను ఇస్తామని రూ.33,116 కేటాయించి మోసం చేశారని మండిపడ్డారు.

March 22, 2026 / 05:42 PM IST

CMRF చెక్కు అందజేసిన MLC

ADB: కౌటాల మండలంలోని తాటినగర్ గ్రామానికి చెందిన డోంగ్రి శంకర్ కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆయనకు మంజూరు చేసిన రూ. 60 వేల CMRF చెక్కును ఆదివారం ఎమ్మెల్సీ దండే విట్టల్ లబ్ధిదారునికి అందజేశారు. సీఎం సహాయనిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

March 22, 2026 / 05:41 PM IST