• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అవ్వకు బువ్వ’ కార్యక్రమం

NZB: ఆర్మూర్ పట్టణంలోని రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జిరాయత్ నగర్ విద్యా హైస్కూల్ ఆవరణలో ‘అవ్వకు బువ్వ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ నెలలో భాగంగా అతి నిరుపేద వృద్దులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి చేశారు. ఈసందర్బంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈకార్యక్రమం ద్వారా అతినిరుపేద వృద్దుల ఆకలి తీర్చడానికి కృషిచేస్తున్నామన్నారు.

March 22, 2026 / 07:07 PM IST

రైతు భరోసా నిధుల విడుదల వీడియో కాన్ఫరెన్స్

WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ పారిశ్రమను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రైతు బంధులను విడుదల చేసిన సందర్భంగా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని వీక్షించారు.

March 22, 2026 / 07:07 PM IST

‘అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం’

ADB: మహబూబాబాద్ జిల్లా కమిటీ ఎన్నికల కోసం వెళ్తున్న ఆదివాసీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపూరావు అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో రాగల్ జెండా కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఆదివాసీల హక్కుల కోసం ఎవరికీ భయపడకుండా పోరాడాలని ఉద్యమకారులకు సూచించారు.

March 22, 2026 / 07:05 PM IST

‘పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించాలి’

SRPT: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తోందని విమర్శించారు.

March 22, 2026 / 07:05 PM IST

గోవులను సంరక్షించాలని సైకిల్ యాత్ర

MNCL: గోమాతను కాపాడాలని జగిత్యాల జిల్లాలోని బుగ్గారం గోశాల నిర్వాహకులు అగస్త్య మహారాజ్ కోరారు. గోవులను సంరక్షించాలని కోరుతూ మహారాజ్ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జన్నారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు భక్తులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ లక్ష్యంగా మార్చి 21న జగిత్యాల నుంచి కేదార్నాథ్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

March 22, 2026 / 07:03 PM IST

ఈ నెల 25న తైబజార్ వేలం పాట

KMR: మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఈ నెల 25వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి తైబజార్ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. తైబజార్ వేలం పాటలో పాల్గొనే వారు రూ.15 వేలు ముందుగా ధరావత్తు ఫీజు చెల్లించాలన్నారు.

March 22, 2026 / 07:02 PM IST

ముప్పారం గ్రామాభివృద్ధికి సహకరిస్తా: MLA

HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముప్పారం జిపి ఆఫీసులో సర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముప్పారం నుంచి దేవునూరు వెళ్లే రోడ్డు గ్రామ పరిధి వరకు డబుల్ సీసీ రోడ్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

March 22, 2026 / 07:02 PM IST

సీఎంపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే

RR: సీఎం రేవంత్ రెడ్డిపై షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. షాద్ నగర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మూసీ నదిని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని, వ్యక్తి గతంగా ఈ విషయంలో ఆయనకు మద్దతు పలుకుతున్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు వేరైనా తాను మాత్రం సీఎంను ఈ విషయంలో సమర్థిస్తున్నానన్నారు.

March 22, 2026 / 07:02 PM IST

భారీగా నల్ల బెల్లం సీజ్.. ముగ్గురు అరెస్ట్

నల్గొండ అసిస్టెంట్ కమిషనర్(ఎన్‌ఫోర్స్‌మెంట్) బీ. సంతోష్ ఆదేశాల మేరకు, ఏఈఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ. కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దేవరకొండ మండలంలో భారీ దాడులు నిర్వహించారు. పడమటి పల్లి క్రాస్ రోడ్ సమీపంలో జరిపిన ఈ రూట్ వాచ్‌లో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక మరియు నాటు సారాను పట్టుకున్నారు.

March 22, 2026 / 07:01 PM IST

పోతారంలో జల మహోత్సవం ర్యాలీ

MDK: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనోహరాబాద్ మండలం పోతారంలో మిషన్ భగీరథ విభాగం, సర్పంచ్ పుట్ట వినోద ఆధ్వర్యంలో జల మహోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ కిరణ్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, జలవనరులను సంరక్షిస్తేనే భవిష్యత్ తరాల మనుగడ సాధ్యమని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.

March 22, 2026 / 07:01 PM IST

’28న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోవాలి’

SRD: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ వెంకటరెడ్డి సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలాల ప్రజలకు సూచించారు. ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 28న ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. యాక్సిడెంట్, గొడవలు, చీటింగ్, చిట్ఫండ్, భూతగాదాలు, చిన్నచిన్న దొంగతనాలు, అక్రమ రవాణా కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు.

March 22, 2026 / 07:00 PM IST

దివ్యాంగుడికి హామీ ఇచ్చిన మంత్రి అడ్లూరి

JGL: గొల్లపల్లి మండలం వెలుగొండ గ్రామ పర్యటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుడు శాఖపురం శ్రీనివాస్‌తో మాట్లాడారు. అతని పరిస్థితిని తెలుసుకుని కొత్త ట్రైసైకిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ అంశంపై విచారించి, వెంటనే వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.

March 22, 2026 / 07:00 PM IST

త్వరలో ప్రారంభం కానున్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్

WGL: నగరానికి మరొక ఆకర్షణగా నిలవబోతున్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్స్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. కుడా ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో అద్భుతమైన సౌండ్ అండ్ లైట్ షోతో కూడిన మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగర సౌందర్యాన్ని పెంచుతూ పర్యాటకులను ఆకట్టుకునే ఈ గార్డెన్స్ వరంగల్‌కు గర్వకారణంగా మారనున్నాయి.

March 22, 2026 / 07:00 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

NLG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

March 22, 2026 / 06:50 PM IST

అభివృద్ధి పనులను పరిశీలించిన ఛైర్మన్

WGL: భద్రకాళి బండ్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి పరిశీలించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఓరుగల్లు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఛైర్మన్ అన్నారు.

March 22, 2026 / 06:48 PM IST