• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘గర్భిణీలకు వైద్య పరీక్షలు ‘

KMR: బీబీపేట్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డా.భానుప్రియ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అవసరం మేరకు రక్త పరీక్షలు చేసి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించినట్లు తెలిపారు.

March 11, 2025 / 11:05 AM IST

విద్యార్ధిని అభినందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

WGL: పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీ చైతన్య ఇటీవల ఖమ్మం పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈరోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యార్థినికి శాలువ కప్పి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, కరాటే శరీర ధృత్వానికి, స్వీయ రక్షణకు దోహదపడుతుందని తెలిపారు.

March 11, 2025 / 10:50 AM IST

క్వింటా పత్తి ధర ఎంతంటే..?

WGL: ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారస్థులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

March 11, 2025 / 10:17 AM IST

అధ్వానంగా రోడ్డు

HYD: కార్వాన్ డివిజన్ పరిధిలోని దర్బార్ మైసమ్మ ఆలయానికి వెళ్లేదారి అధ్వానంగా తయారైంది. చాలా ప్రాంతాల్లో రోడ్డు గుంతలు పడడంతో ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ మరమ్మతులు చేపట్టి వదిలేస్తున్నారని, అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కావడంలేదని తెలిపారు. నూతన రోడ్డు పనులు చేపడితేనే సులువుగా ఉంటుందని స్థానికులు కోరారు.

March 11, 2025 / 10:14 AM IST

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYD: నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

March 11, 2025 / 10:03 AM IST

నేటి నుంచి అయ్యప్ప ఆలయంలో ఉత్సవాలు

మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని హరిహర అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలు ఈనెల 11 నుంచి 13 వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం మహాగణపతిపూజ, ప్రసాదశుద్ధి, స్థలశుద్ధి, మహాగణపతిహోమం, వాస్తుహోమం, బుధవారం మహాగణపతిహోమం, కలశపూజ, ధ్వజారోహణం, పడిపూజ ఉంటాయన్నారు.

March 11, 2025 / 09:48 AM IST

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

KMR: బిక్కనూర్ బీ సీ బాలుర వసతి గృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రినీత్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.విద్యార్థి రినీత్ నుఉపాధ్యాయులతో పాటు వసతి గృహ సిబ్బంది అభినందించారు.

March 11, 2025 / 07:51 AM IST

యాంటీ-నార్కోటిక్ బ్యూరోగా రూపేశ్ బాధ్యతల స్వీకరణ

HYD: తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.

March 11, 2025 / 07:38 AM IST

విమెన్ హెల్ప్ లైన్ సెంటర్‌లో మంత్రి సితక్క

HYD: మంత్రి సీతక్క సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. హెల్ప్ లైన్ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన సీతక్క.. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేసి, బాధితురాలి ఆవేదన విన్నారు. తన భర్త వేధిస్తున్నాడని లలిత అనే మహిళ ఫోన్ చేయగా మాట్లాడారు.

March 11, 2025 / 07:34 AM IST

ఇంటర్ విద్యార్థులకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

HYD: గవర్నర్ నేడు ఉదయం 8గంటలకు ములుగు వెళ్తుండడంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోకుండా ఉదయం 8:30నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2025 / 07:31 AM IST

తాగునీటి ఇబ్బందులను తొలగించాలి

మేడ్చల్: వేసవిలో తలెత్తున్న తాగునీటి ఇబ్బందులను తొలగించాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. బాలానగర్, వినాయకనగర్ డివిజన్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి అధికారులతో చర్చించారు. లో- ఫ్రెషర్ సమయపాలన లేకుండా సరఫరా, లీజేజీలు నివారించాలన్నారు. జలమండలి మేనేజర్లు అనిల్‌కుమార్, సతీశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 11, 2025 / 07:29 AM IST

‘మున్సిపల్ కార్మికులు నిబద్దతతో పని చేయాలి’

KMR: కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీలో కొందరు పారిశుధ్య కార్మికులు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారని, ఈ విషయమై మార్పు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల కార్మికులు, యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు నిబద్ధతతో పని చేయాలి అన్నారు.

March 10, 2025 / 06:29 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలి’

KMR: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.

March 10, 2025 / 06:11 PM IST

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి: ఏఐటీయూసీ

NZB: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్‌లోని AITUC కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభలో ముందుగా రైతు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు చేస్తుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.

March 10, 2025 / 05:56 PM IST

పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

NLG: నార్కట్ పల్లి మండలం ఏపి లింగోటం గ్రామంలో, యాదవ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు చల్లగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

March 10, 2025 / 04:49 PM IST