HYD: కార్వాన్ డివిజన్ పరిధిలోని దర్బార్ మైసమ్మ ఆలయానికి వెళ్లేదారి అధ్వానంగా తయారైంది. చాలా ప్రాంతాల్లో రోడ్డు గుంతలు పడడంతో ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ మరమ్మతులు చేపట్టి వదిలేస్తున్నారని, అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కావడంలేదని తెలిపారు. నూతన రోడ్డు పనులు చేపడితేనే సులువుగా ఉంటుందని స్థానికులు కోరారు.