KMR: బీబీపేట్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డా.భానుప్రియ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అవసరం మేరకు రక్త పరీక్షలు చేసి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించినట్లు తెలిపారు.