NLR: వింజమూరులోని టీడీపీ ఆఫీస్లో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిర్వహించారు. బాధితుల సమస్యలను విని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామన్నారు.