WGL: పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీ చైతన్య ఇటీవల ఖమ్మం పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈరోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యార్థినికి శాలువ కప్పి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, కరాటే శరీర ధృత్వానికి, స్వీయ రక్షణకు దోహదపడుతుందని తెలిపారు.