SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇవాళ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తడక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా ఎనగందుల దశరథం, గౌడ మల్లేశం, కార్యదర్శిగా దొంత బాలరాజు, కోశాధికారిగా గౌడ కృష్ణహరి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ మనోహర్లను, కార్యవర్గ సభ్యులను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
KMM: మధిర మండలం ఆత్కూరు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదివారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల వల్ల జరిగిన ఆస్తి.పంట నష్టంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
NRPT: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ధన్వాడ మండలంలోని మందిపల్లి చెరువు ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోకుండా నిండు నీటితో మెరిసిపోతోంది. సుమారు 123 ఎకరాల పంటలకు సాగునీరు అందిస్తూ రైతులకు కొంగుబంగారంగా మారింది. వానాకాలంలో అలుగు పారితే పంటలకు మేలు జరుగుతుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: బెల్లంపల్లి బస్తీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిర్వాహకులు కోరారు. ఆదివారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు.
BDK: గుండాల మండలం మామకన్ను గ్రామపంచాయతీకి చెందిన 104 ఒప్పంద ఉద్యోగి పాయం నాగేశ్వరరావు (38) ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 సేవల్లో పనిచేస్తున్న ఆయనకు ఉదయం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందారు.
JN: జనగామ పట్టణంలోని 29వ వార్డులో ఈ నెల 26న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో ప్రజలకు ఆదివారం తొర్రూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తొర్రూరు సీఐ గణేష్ మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పకుండా ధరించాలని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడి జీవితాన్ని ఆగం చేసుకోవద్దని కోరారు.
ADB: బోథ్ మండల కేంద్రంలో నూతన ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదివారం తెలిపారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం అందుతుందని పేర్కొన్నారు.
BDK: పినపాక రైతు వేదికలో ఏడీఏ తాతారావు, ఏఓ వెంకటేశ్వర్లతో కలిసి మహిళా రైతులకు తైవాన్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందజేస్తోందని వారు తెలిపారు. ఆదివారం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయానికి ఆధునిక యంత్ర పరికరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.
MNCL: బెల్లంపల్లికి చెందిన అమ్మఒడి NGO మధుకర్కు పద్మశాలి ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్లో మాజీమంత్రి, సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశాయి. మధుకర్ సేవా కార్యక్రమాలను గుర్తించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
HYD: నగర పరిధిలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2026లో ఇప్పటి వరకు హైదరాబాద్లో 393, రంగారెడ్డి 236, మేడ్చల్ 177 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే.. HYD నగరంలో ఫైర్ సేఫ్టీ లేని కమర్షియల్ భవనాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం లేదని, నిబంధనలు కఠినంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
SDPT: జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి సీఎం హాజరవుతున్న తరుణంలో నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధి పనుల మోక్షానికి నిధులు ప్రకటించే అవకాశం ఉందని చర్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులకు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించనుందా ?.
SDPT: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చెరువును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 18 కోట్ల కేటాయించారు. గత సంవత్సరం మంత్రి పొన్నం ప్రభాకర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తయి పట్టణ ప్రజలకు కనువిందు చేయనున్నాయి.
ADB: బోథ్ మండలంలోని పలు మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల 66 వేల విలువ గల CMRF చెక్కులను MLA అనిల్ జాదవ్ ఆదివారం పంపిణీ చేశారు. CMRF పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని అన్నారు. వైద్య ఖర్చుల వివరాలను MLA క్యాంపు కార్యాలయంలో సమర్పించి CMRF తద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం బస్ స్టేషన్ ఆవరణలో పారిశుద్ధ్యం లోపించింది. చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్ధపదార్థాలను బస్ స్టేషన్ ఆవరణలో పడేయయడంతో అపరిశుభ్రంగా తయారయింది. దీనికి తోడు ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.