• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి’

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం సంజయ్ నగర్ గ్రామపంచాయతీ సీపీఐ పార్టీ బలపరిచిన కుంజా సుధాకర్ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ పార్టీ చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి ఆధ్వర్యంలో గ్రామంలో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థించారు.

December 15, 2025 / 11:13 AM IST

‘న్యూఇయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి’

HYD: కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని CP సజ్జనార్ పేర్కొన్నారు. అనుమతిలేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, 31న అర్ధరాత్రి ఒంటి గంటవరకే వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నిర్వహణ ప్రాంగణంలో CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

December 15, 2025 / 11:11 AM IST

‘ప్రమాణాలు పాటించకుండా డిలిమిటేషన్ చేశారు’

RR: మైలార్‌దేవ్ పల్లి డివిజన్ విభజనపై BJP నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సమావేశంలో డివిజన్ ప్రెసిడెంట్ సూరెడ్డి వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. వార్డుల డిలిమిటేషన్ ప్రక్రియ MIMకు అనుకూలంగా జరిగిందని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో కొత్త డివిజన్ తక్కువ జనాభా ఉండగా, మైలార్‌దేవ్ పల్లిలో 40 వేల మంది ఉన్నారని తెలిపారు. రాబోయే GHMC ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

December 15, 2025 / 11:10 AM IST

ఈ నెల 23న అరుణాచలానికి స్పెషల్ బస్సు

PDPL: గోదావరిఖని నుంచి అరుణాచలానికి 7 రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్ర GDK బస్టాండు నుంచి DEC 23న ప్రారంభమై తిరిగి 29న చేరుకుంటుంది. యాత్రలో కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశేంబు, మధురై, రామేశ్వరం, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబ దర్శనాలు చేసుకోవచ్చుని, ఒక్కరికి ఛార్జీ రూ.8 వేలుగా ఉంటుందని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు.

December 15, 2025 / 11:08 AM IST

అక్బర్ పేట భూంపల్లిలో గెలిచింది వీరే..

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలంలో సర్పంచ్లు.. బొప్పాపూర్- భానుప్రసాద్(బీజేపీ), అక్బర్ పేట-మండల కుమార్ (ఇతరులు), అల్మాస్పూర్-మీరపురం పద్మ(ఇతరులు), బేగంపేట్-అన్నబోయిన చంద్రశేఖర్ (ఇతరులు), భూంపల్లి- రంగయ్య గారి జన్నారెడ్డి(బీఆర్ఎస్), జంగపల్లె-పాతూరి లావణ్య (ఇతరులు), ఖాజీపూర్-కప్పర్ల భాగ్యలక్ష్మి (ఇతరులు), కూడవెల్లి-ఎనగంటి రేణుక (ఇతరులు), మోతే- శ్రీనివాస్ గౌడ్ గెలిచరు.

December 15, 2025 / 11:08 AM IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి మిర్చి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,200, కొత్త మిర్చి రూ.14,711 పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ గడిచిన శుక్రవారంతో పోలిస్తే కొత్త మిర్చి ధర రూ.400 తగ్గగా.. పత్తి ధర రూ.100 పెరగగా.. అటు ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

December 15, 2025 / 11:05 AM IST

మూడవ దశ పూర్తయ్యే వరకు MCC అమలులో ఉంటుంది: ఎస్పీ

MBNR: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు మూడు దశల ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోనే కొనసాగుతుందని ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగాలంటే ప్రజలు, అభ్యర్థులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

December 15, 2025 / 11:05 AM IST

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా.!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,420 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 16,200 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 19,000 పలికింది. తేజ మిర్చి ధర రూ. 14,400కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

December 15, 2025 / 11:01 AM IST

భోరజ్ మండలం నూతన సర్పంచులు వీరే..!

ADB: భీరజ్ మండల నూతన సర్పంచులుగా అకోలి- శంబుదాస్, బాలాపూర్-అచ్యుత్, భోరజ్-సాయివర్మ, గిమ్మ(కే)-ప్రద్యుమ్న, గూడ-రఘు, హసీంపూర్-విజయ, కమై-వికాస్, కోర్టా-సవిత, లేకర్ వాడ-ప్రభాకర్, మందగడ-రవీందర్, పెండల్ వాడ-నిర్మల, పిప్పరవాడ-సంతోష్ రెడ్డి, పూసాయి-కుసుంబాయి, రాంపూర్(టి)-వెంకటమ్మ, సవాపూర్-లక్ష్మిబాయి, సిర్సన్న-ప్రణీత, తరోడ(బి)-అరవింద్‌ లు గెలుపొందారు.

December 15, 2025 / 11:00 AM IST

7 మండలాల్లో 110 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రెండో విడతలో భాగంగా 175 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో 110 స్థానాల్లో కాంగ్రెస్, 34 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇదిలావుంటే, 7 మండలాల్లో కలిపి 23 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

December 15, 2025 / 10:55 AM IST

నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా, ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కార్యాలయానికి రావద్దాన్ని సూచించారు.

December 15, 2025 / 10:51 AM IST

తాండూర్ సర్పంచ్‌గా 1,443 ఓట్ల మెజార్టీతో సురేష్ గెలుపు

MNCL: తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ముడిమడుగుల సురేశ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి మాస వెంకటస్వామిపై 1,443 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. దీంతో ఫలితం ఆలస్యమైంది. ఈ సందర్బంగా సోమవారం అయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

December 15, 2025 / 10:51 AM IST

మేడారం పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

MLG: తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల రాతి నిర్మాణాలు, రాతి స్తంభాల స్థాపన పనులను మంత్రి సీతక్క ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క, అధికారులను ఆదేశించారు. భద్రాచలం MLA వెంకట్రావు, DCC అధ్యక్షుడు అశోక్ ఉన్నారు.

December 15, 2025 / 10:48 AM IST

క్లాస్ మేట్‌లే సర్పంచ్, ఉపసర్పంచ్‌లు

NRML: దిలావర్పూర్ మండలం మేజర్ గ్రామపంచాయతీ అయిన దిలావర్పూర్ కు నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇద్దరు క్లాస్మేట్ లు సర్పంచ్,ఉపసర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అక్షర అనిల్ సర్పంచ్‌గా విజయం సాధించగా, వర్డ్ మెంబర్‌గా గెలిచిన ఉద్యమ నాయకుడు సుకేష్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో వారి క్లాస్మేట్‌లు వారిని అభినందించారు.

December 15, 2025 / 10:48 AM IST

తండ్రి కళ్ల ముందే కూతురు దుర్మరణం

RR: హయత్‌నగర్ RTC కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఐశ్వర్య ఇవాళ ఉదయం రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తన తండ్రి, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

December 15, 2025 / 10:46 AM IST