BDK: చర్ల మండల సరిహద్దు ప్రాంతమైన బాసగూడ-ఆవపల్లి ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన 50 కిలోల ఈఐడీ బాంబును గురువారం సీఆర్పిఎఫ్ పోలీసులు గుర్తించారు. పోలీసులే లక్ష్యంగా ఈఐడీ బాంబును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బాంబు స్క్వాడ్ ద్వారా బాంబును నిర్వీర్యం చేసి ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ములుగు: జిల్లాలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు మల్లంపల్లి మండల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడారం చేరుకొని మినీ మేడారం జాతరపై రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు తాడ్వాయిలోని బ్లాక్ బెర్రీ దీవులను ప్రారంభిస్తారు. అనంతరం ములుగు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
MHBD: జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో నేడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు మరిపెడ మండలం బుర్హనపురం గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి మాతృమూర్తి మరణించడంతో వారి కుటుంబానికి పరామర్శిస్తారు. 11.30 గంటలకు మరిపెడ మండల కేంద్రంలో స్టీల్ ఐరన్ షాప్తోపాటు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచనున్నారు.
HNK: వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు GWMC 46వ డివిజన్ మడికొండ గ్రామ ఎస్సీ కాలనీలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వర్ధన్నపేట పురపాలక సంఘం కార్యాలయం నందు పాలకవర్గ వీడ్కోలు సమావేశాలలో పర్యటిస్తారని తన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.
KMR: రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 26న రైతు భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందుతుందన్నారు.
NZB: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా స్పష్టం చేశారు. నేడు ధర్మారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రివేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహణపై ప్రిన్సిపల్తో మాట్లాడారు.
NZB: పసుపు రైతుల సంక్షేమానికి పాటుపడాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డికి సూచించారు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్గా ఎన్నికైన గంగారెడ్డికి గోయల్ శుభాకాంక్షలు తెలిపారు.
JGL: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎస్సై కిరణ్ కుమార్ ప్రత్యేక చొరవచూపి గుంతలను పూడ్చి వేయించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏర్పడిన పెద్ద గుంతను సిమెంట్తో పూడ్చి వేయించారు. కూడళ్ల వద్ద ఏర్పడిన గుంతలను సైతం సిమెంట్తో పూర్తి వేయించడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సై ని పలువురు అభినందించారు.
NZB: ఈనెల 25న జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాయాలు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఇఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శనలు, జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ, విద్యార్థుల ర్యాలీ, ఎస్సే రైటింగ్, క్విజ్ తదితర పోటీలను విద్యార్థులకు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
KMM: తల్లాడ మండల పరిధిలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన మువ్వ పుల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, పోట్రు శ్రీనివాసరావు, మోత్కూరి శ్రీనివాసరావు, గుండ్ల వెంకటేశ్వర్లు, మువ్వా రోశయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈనెల 25వ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి అధికారి రాఘవేందర్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
SRCL: తంగళ్లపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దూరి తిరుపతి, రెడ్డి పర్ష రాములు, మచ్చ శ్రీనివాస్, పాల్గొన్నారు.
JN: పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన నాసం రాజేష్ తార్నాక-హైదరాబాదులోని CSIR- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ‘కెమికల్ సైన్స్’లో PHD విద్యను అభ్యసిస్తున్నాడు. ఆయన ఉత్తరప్రదేశ్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ & ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ACSIR) సెంటర్ నుండి PHD పట్టాను అందుకున్నాడు. ఈ క్రమంలో PHD పట్టా అందుకున్న రాజేష్ను గ్రామస్థులు అభినందించారు.
KMM: ఖమ్మం దానవాయిగూడెంలో ఉన్న జిల్లా కారాగారాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. జిల్లా సబ్ జైల్ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి సబ్ జైల్లో ఉన్న అన్ని బ్లాక్లను పరిశీలించారు. నిరక్షరాస్యులైన ఖైదీలకు వారి సంతకం, అక్షరమాల నేర్పించడం చూసి ప్రశంసించారు. కారాగారం భద్రతకు సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.
KNR: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఆనంతరం 10.30 కు కేంద్ర మంత్రులతో అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.