• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మంచినీటి సమస్యను పరిష్కరించాలి: మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న గండ్ర ఆదివారం ఇళ్లను సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 22, 2026 / 01:26 PM IST

ఆటిజంతో బాలుడి పోరాటం.. సాయం కోసం ఎదురుచూపులు

SRPT: సూర్యాపేటకు చెందిన నాలుగేళ్ల హయాన్ చంద్ర ‘హైపర్ ఆటిజం’తో పోరాడుతున్నాడు. మెరుగైన చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు స్పందించి 8919099899 నంబర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

March 22, 2026 / 01:24 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: నాయకులు

NRPT: ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

March 22, 2026 / 01:21 PM IST

రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్‌చేంజ్..!

HYD: పారిశ్రామిక పార్కులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడానికి HMDA అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ సమీపంలోని ఓఆర్ఆర్ పై రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్‌చేంజ్ నిర్మాణానికి HMDA సిద్ధమైంది. అధికారిక యంత్రాంగం దీనికోసం విస్తృతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.

March 22, 2026 / 01:17 PM IST

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలన

WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్‌లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

March 22, 2026 / 01:17 PM IST

రామప్పలో అద్భుత దృశ్యం..!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రసిద్ధ రామప్ప దేవాలయం శిఖరంపై ఉన్న కలశాన్ని తాకుతూ ఉదయించే సూర్యుడు అపూర్వ దృశ్యాన్ని సృష్టించాడు. ఆ క్షణాన్ని ప్రధాన అర్చకుడు హరీశ్ శర్మ తన చరవాణిలో బంధించారు. భానుడి కిరణాలు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మరింత ప్రతిబింబింపజేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

March 22, 2026 / 01:16 PM IST

TRP రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మల్లేశం గౌడ్

SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బుర్ర మల్లేశం గౌడ్‌ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్‌కు చెందిన మల్లేశం గౌడ్ ప్రజా పోరాటాల ద్వారా చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు స్థానం కల్పించినట్లు అధ్యక్షులు వెల్లడించారు.

March 22, 2026 / 01:14 PM IST

కార్బన్ డై ఆక్సైడ్ భూగర్భంలో దాచొచ్చు..!

హైదరాబాద్ NGRI, IISER శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులపై కీలక పరిశోధనలు చేపట్టారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను భూగర్భంలో నిల్వ చేసే విధానంపై వివరించారు. సౌరాష్ట్ర, భోపాల్, ముంబై-పుణె-నాసిక్ కారిడార్ ప్రాంతాలు ఇందుకు అనుకూలమని గుర్తించారు. నిల్వ చేసిన CO₂ కొద్ది కాలంలోనే కార్బోనేట్ రాళ్లుగా మారుతుందన్నారు.

March 22, 2026 / 01:14 PM IST

ఈనెల 24న పట్టుబడిన వాహనాలకు వేలం

NLG: దేవరకొండలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 24న వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు టూవీలర్ వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్‌కు రూ. 30 వేలు డిపాజిట్‌ను అదే రోజు ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 01:14 PM IST

శనగల కొనుగోలు షురూ.. క్వింటా రూ.5,875

ADB: ఉట్నూరు మండలం శ్యాంపూర్ సహకార దాల్ మిల్లో ప్రభుత్వ శనగల మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాధ్ ప్రారంభించారు. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ.5,875 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ పంటను బాగా ఎండబెట్టి, శుభ్రపరిచి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జయవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 01:14 PM IST

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం, చందనవెల్లి గ్రామంలో తలారి లక్ష్మమ్మకి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం న్యూ కాలనీలోని రోడ్డును ప్రారంభించారు.

March 22, 2026 / 01:12 PM IST

సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే వీరేశం

NLG: నకిరేకల్ పట్టణంలో శ్రీ శాలిహవన చక్రవర్తి జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహానుభావుల ఆశయాలను స్మరించుకుంటూ.. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేతో పాటు శాలివాహన సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

March 22, 2026 / 01:09 PM IST

అత్తాపూర్‌లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక

RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నర్సాబాయి కుంట పరిసర ప్రాంతాల్లో డీసీ సమ్మయ్య ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

March 22, 2026 / 01:08 PM IST

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎంపీ

MDK: బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రశిక్షణ మహాభియాన్ కార్యశాలలో మెదక్ ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ శక్తివంతం కోసం కార్యకర్తలు శిక్షణ పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

March 22, 2026 / 01:08 PM IST

జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా శ్రీహరి రాజు ఎన్నిక

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇటీవలే నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎన్నికయింది. ఇందులో శ్రీరంగాపూర్ మండల నాయకులు రెడ్డి చర్ల శ్రీహరి రాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడతానని ఆయన పేర్కొన్నారు.

March 22, 2026 / 01:06 PM IST