NRML: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి ఎంపీడీవో కార్యాలయాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళకు ఆయన భూమి పూజ చేశారు.