• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పంచాయతీ కార్మికుల భిక్షాటన

నారాయణపేట: పంచాయతీ కార్మికులకు వేతనాలు అందటం లేదని శనివారం నారాయణపేట పట్టణంలో టీయుసీఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వున్న పంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

March 15, 2025 / 03:03 PM IST

‘రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం’

ADB: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఖానాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్,  డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల అమలు చేస్తుందని వివరించారు.

March 15, 2025 / 12:13 PM IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

KMM: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మధిర మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండల కేంద్రంలోని శాంతి థియేటర్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెప్పారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2025 / 11:19 AM IST

సీపీ సాయి చైతన్యను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ జిల్లాకు నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో లా& ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపి యువతను బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

March 15, 2025 / 11:17 AM IST

స్టేట్ టాపర్‌గా నిలిచిన జిల్లావాసి

MDK: జిల్లాలోని పాపన్న పేటకు చెందిన అర్జున్ రెడ్డి గ్రూప్-3 స్టేట్ టాపర్‌గా నిలిచాడు. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆయన 339 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించారు. ఈయన ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 

March 15, 2025 / 11:10 AM IST

కిష్టారం సమస్యలపై CMDకి సత్తుపల్లి MLA వినతి

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సింగరేణి సీఎండీని హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింగరేణి సీఎండీ కిష్టారం బ్లాస్టింగ్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అదే విధంగా సింగరేణి సైలో బంకర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.

March 15, 2025 / 11:06 AM IST

జిల్లాలో నిరంతరం విద్యుత్ సరఫరాకు ప్రత్యేక కార్యచరణ

KMM: జిల్లాలో ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి వెల్లడించారు. శనివారం వారి కార్యాలయం నుంచి మాట్లాడుతూ..విద్యుత్ అంతరాయం కలగకుండా 24/7 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసామని అన్నారు. వీరు నిరంతరం విద్యుత్ కోతలపై పర్యవేక్షిస్తారని తెలిపారు.

March 15, 2025 / 11:06 AM IST

నేటి నుంచి ఒక పూట బడులు ప్రారంభం

HYD: హైదరాబాదులో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. అటు పాఠశాలలు కూడా నేటి నుంచి ఒంటి పూట నడవనున్నాయి.

March 15, 2025 / 08:09 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

KMM: నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

March 15, 2025 / 08:09 AM IST

పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

MDK: పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్ (24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 14, 2025 / 12:48 PM IST

హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో హోలీ సంబరాలను శుక్రవారం ఉదయం నుంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సామరస్య పూర్వకంగా ఘనంగా నిర్వహించుకోవాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

March 14, 2025 / 11:31 AM IST

రేషన్ డీలర్ పై కేసు నమోదు

MNCL: రామకృష్ణాపూర్ పట్టణం ఆర్కే-1 మార్కెట్‌లో ఉన్న 38 నెంబర్ గల రేషన్ దుకాణంలో ఉండాల్సిన నిలువల కన్నా మూడున్నర క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు.. జిల్లా పౌరసరఫరాధికారి బ్రహ్మారావు తనిఖీ చేసి గుర్తించారు. ఈ మేరకు సదరు డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో ఏసీ ఎస్ఓ వేణుగోపాల్, ఆర్ఎ భూమేష్ తదితరులు ఉన్నారు.

March 14, 2025 / 11:12 AM IST

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్

JN: జిల్లాలో సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ఘనపూర్ (స్టేషన్) పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కల్సి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

March 12, 2025 / 11:27 AM IST

మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

 WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీగా మిర్చి తరలివచ్చింది. ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. తేజ మిర్చి క్వింటాకు ₹13,400 (నిన్న ₹13,500) 341 రకం మిర్చి క్వింటాకు ₹13,100 (నిన్న ₹13,000) వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు ₹16,500 (స్థిరంగా కొనసాగుతోంది) అని అధికారులు తెలిపారు.

March 12, 2025 / 11:23 AM IST

ధూమపానం వీడితే.. విజేతలే: మాచన రఘునందన్

HYD: ధూమపానం వీడితే వాళ్లే నిజమైన జీవిత విజేతలు అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహాశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మార్చి 12వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాచిగూడలో మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 12, 2025 / 10:24 AM IST