MBNR: మహబూబ్ నగర్ 23వ డివిజన్ సొసైటీ పరిధిలో వింత పరిస్థితి నెలకొంది. ఓటర్ల జాబితాలో తప్పుల వల్ల ఈ డివిజన్ ఓట్లు 8, 23, 24 డివిజన్లలోకి వెళ్లాయి. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సొసైటీ ప్రజలు ఆ మూడు డివిజన్ల కార్పొరేటర్లను ఆహ్వానించి సన్మానం చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం ముగ్గురు కార్పొరేటర్లు కలిసి పనిచేయాలని స్థానికులు కోరారు.
RR: తుర్కయాంజల్లో బీజేపీ ఎదుగుదలకు క్రమశిక్షణ, సేవా భావమే మూలమని పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణలో ఆయన ప్రసంగించారు. అంత్యోదయ భావనతో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరడమే లక్ష్యమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
PDPL: జిల్లా లైసెన్సుడు సర్వేయర్స్ అసోసియేషన్ సమావేశాన్ని ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాతూరి అనిల్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల తిరుపతి, ఉపాధ్యక్షులుగా ఎండి జుబీర్, బూర్ల సురేష్, కోశాధికారిగా సాన కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీకి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
HNK: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ, ఓ-సిటి, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొని స్వయంగా చెత్తను తొలగించారు. ఓరుగల్లు నగరాన్ని పరిశుభ్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్య క్రమానికి రావాలని ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
NRML: బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన నిహాల్ కెనరా బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎంప్లాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సాయినాథ్, తదితరులు పాల్గొని అభినందించారు. నిహాల్ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ADB: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఆదివారం పూటూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికి కార్యక్రమ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నాటికి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
MNCL: హైదారాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదిరింపులు, బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని కోరారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న గండ్ర ఆదివారం ఇళ్లను సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
SRPT: సూర్యాపేటకు చెందిన నాలుగేళ్ల హయాన్ చంద్ర ‘హైపర్ ఆటిజం’తో పోరాడుతున్నాడు. మెరుగైన చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు స్పందించి 8919099899 నంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
NRPT: ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
HYD: పారిశ్రామిక పార్కులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడానికి HMDA అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ సమీపంలోని ఓఆర్ఆర్ పై రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్చేంజ్ నిర్మాణానికి HMDA సిద్ధమైంది. అధికారిక యంత్రాంగం దీనికోసం విస్తృతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.
WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రసిద్ధ రామప్ప దేవాలయం శిఖరంపై ఉన్న కలశాన్ని తాకుతూ ఉదయించే సూర్యుడు అపూర్వ దృశ్యాన్ని సృష్టించాడు. ఆ క్షణాన్ని ప్రధాన అర్చకుడు హరీశ్ శర్మ తన చరవాణిలో బంధించారు. భానుడి కిరణాలు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మరింత ప్రతిబింబింపజేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బుర్ర మల్లేశం గౌడ్ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్కు చెందిన మల్లేశం గౌడ్ ప్రజా పోరాటాల ద్వారా చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు స్థానం కల్పించినట్లు అధ్యక్షులు వెల్లడించారు.