MBNR: పట్టణం సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జంతు వధశాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్ కొండ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న జంతు వధశాల నిర్మాణ పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావలన్నారు.