• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేటి మాంసం ధరలు వివరాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 నుంచి 360 పలుకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 310 నుంచి 320 వరకు పలుకుతుంది. అలాగే కేజీ మటన్ ధర రూ.700 నుంచి 750 వరకు పలుకగా.. కేజీ మేక మాంసం ధర రూ. 800 నుంచి 850 వరకు మాంసం విక్రయదారులు తెలిపారు. మీ ప్రాంతాల్లో చికెన్ ధరలు కామెంట్ చేయండి.

March 22, 2026 / 08:10 AM IST

నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ రాక

భువనగిరి: నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్న పేట మల్లేశం తెలిపారు. జనవరిలో నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడలో గెలిచిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యఅతిథిగా బహుమతులు ప్రధానం చేస్తారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మంత్రి బీఎల్ వర్మ వస్తున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 08:09 AM IST

బైరంపల్లిలో ఇంట్లో దొంగతనం ఘటన

MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లిలో మల్లేశ్ కుటుంబం ఊరెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దాడి చేశారు. దుండగులు బీరువా పగలగొట్టి అరతులం బంగారం, 15 తులాల వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై భయానికి లోనయ్యారు.

March 22, 2026 / 08:06 AM IST

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం: నరేష్ జాదవ్

ADB: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం దక్కుతుందని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం మండల అధ్యక్షులతో శనివారం సమావేశమై మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకాలలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 08:02 AM IST

నకిలీ ఫోన్ పే తో మోసం.. రంగంలోకి పోలీసులు

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో డిజిటల్ చెల్లింపుల పేరిట మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మెడికల్ షాపులో రూ.400 విలువైన మందులు కొనుగోలు చేసిన సదరు వ్యక్తి, ఫోన్ పే ద్వారా నగదు పంపినట్లు నకిలీ స్క్రీన్ షాట్ చూపించాడు. అయితే యజమాని కుమార్ ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

March 22, 2026 / 08:00 AM IST

కాజిపల్లి బొల్లారం రహదారిలో సీసీ రోడ్డు

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజి పల్లి – బొల్లారం డివిజన్ రహదారి సీసీ పనులు పూర్తయ్యాయి. గతంలో కంకర, గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రయాణం సుఖంగా, సౌకర్యవంతంగా మారింది. రాకపోకలు సులభమవడంతో స్థానిక వాహనదారులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 07:55 AM IST

నగరంలో బహిరంగంగా సిగరెట్ల విక్రయాలు

WGL: నగరంలో నిషేధిత సిగరెట్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ, కేయూ, NIT, పోచమ్మ మైదానం ప్రాంతాల్లో ఈ అమ్మకాలు బహిరంగంగానే సాగుతున్నాయని తెలిపారు. కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతుందని పట్టణవాసులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి సిగరెట్ల దందా అరికట్టాలని కోరారు.

March 22, 2026 / 07:45 AM IST

గుంతల మయంగా కాజీ పల్లి రోడ్డు

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజీ పల్లి–కొర్లకుంట రహదారి గుంతలతో దెబ్బతింది. చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

March 22, 2026 / 07:42 AM IST

‘దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దు’

MNCL: పిల్లలను దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల జిల్లా శిశు సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలు లేని వారు పిల్లలను చట్టబద్దంగా దత్తత తీసుకోవాలన్నారు. CARA కింద దత్తత ఏజెన్సీ కేంద్రాలు పనిచేస్తాయని, దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:33 AM IST

టీజీ సెట్‌లో జిల్లా వాసి ప్రతిభ

JGL: ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TG-SET 2025) ఫలితాల్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ప్రతిభ చాటారు. తెలుగు సబ్జెక్టులో 154 మార్కులతో ఆమె అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 సబ్జెక్టులకు నిర్వహించిన పరీక్షలో మొత్తం 2,565 మంది క్వాలిఫై అవ్వగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించిన జ్యోతిని పలువురు అభినందించారు.

March 22, 2026 / 07:32 AM IST

రంజాన్ మాసం చివరి రోజు.. విక్రయాల జోరు..!

MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో హలీం విక్రయాలు నిన్న జోరుగా కొనసాగాయి. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో హలీం కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రముఖ హోటళ్లు, స్టాళ్ల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూశారు. ప్రత్యేక రుచితో ప్రసిద్ధి చెందిన హలీం కోసం యువతతో పాటు కుటుంబాలు కూడా ఆసక్తి చూపారు.

March 22, 2026 / 07:30 AM IST

‘అభివృద్ధి పనుల నిధుల మంజూరుకు నివేదిక’

KNR: శంకరపట్నం (M) అంబాల్పూర్‌లో గ్రామంలో సీసీ రోడ్లు, పంచాయతీ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గ్రామంలో డీఆర్డీవో శ్రీధర్ పలు వీధుల్లో రోడ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు డీఆర్డీఓ తెలిపారు.

March 22, 2026 / 07:21 AM IST

జిల్లాలో నేడు చికెన్ ధర ఎంతంటే ?

KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 340 నుంచి రూ.350 వరకు విక్రయిస్తుండగా, లైవ్ కోడి ధర కిలో రూ. 220కు విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధర కిలో రూ.800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది.

March 22, 2026 / 07:19 AM IST

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు.

March 22, 2026 / 07:16 AM IST

భక్తులకు వడ్డన చేసిన MLA అనిల్ జాదవ్

ADB: మహారాష్ట్రలోని పౌర దేవి యాత్రకు బయలుదేరిన భక్తుల పాదయాత్ర శనివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులకు స్థానిక ఫంక్షన్ హాల్‌లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న భక్తులకు స్వయంగా అన్నాన్ని వడ్డించారు. క్షేమంగా పౌర దేవి అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు.

March 22, 2026 / 07:12 AM IST