KMM: ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్గా మంగళవారం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలిపారు. అనంతరం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
PDPL: ప్రమాదాలను అరికట్టడానికి విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమాలు చేపడుతున్నారని PDPL సర్కిల్ SE మాధవరావు పేర్కొన్నారు. తద్వారా రైతుల్లో, విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి శాఖ పరమైన అధికారులు చేయవలసిన పనులను వ్యక్తిగతంగా/ప్రైవేట్ వ్యక్తులతో చేయించకూడదన్నారు.
PDPL: తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మార్చకూడదని గోదావరిఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెలిశెట్టి నటరాజశేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పేరు మార్పిడి విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
SRCL: కలెక్టరేట్లో ఈనెల 25న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వకర్మ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఫోర్మాలైజెసన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
BHPL: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం మంగళవారం భూపాలపల్లిలో చోటుచేసుకుంది. హత్య కేసులో ఏరిగా బీఆర్ఎస్ నేత హరిబాబు 24 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రధాన అనుచరుడు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలతోనే తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగం భార్య సరళ ఆరోపించింది.
NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అనారోగ్యానికి గురై బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
KMM: కల్లూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు చకచకా పూర్తవుతున్నాయి. మండలంలో ముగ్గు వెంకటాపురం, లింగాల, ఓబుల్ రావు బంజర్ సమీపంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ సమావేశంలో ఆగస్టు 15 వరకు దాదాపుగా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.
WGL: రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించారు.
SRD: భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు 150 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3, నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది.
MHBD: గూడూరు మండలం బొద్దుగొండ సమీపంలోనున్న గండి తండ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపతిపేట సబ్ స్టేషన్లో విధులు ముగించుకొని తిరిగీ ఇంటికి వస్తుండగా తండా యకాస్వామి తలపై నుంచి దూసుకెళ్లిన గుర్తుతెలియని వాహనం. మృతుడుది తొర్రూర్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.
KMM: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ DCPఆడ్మీన్ నరేష్ కుమార్ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ను CEIRపోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.7 లక్షలని పేర్కొన్నారు.
BDK: బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు సోమవారం తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో రేపు మంగళవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి అక్కవరం శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల సేమియా బాధితుల కోసం రక్తం సేకరించడం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.
HNK: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికై 76 ఆర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సమస్యలను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.