BDK: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 17, 18వ తేదీల్లో చండ్రుగొండ, అశ్వరావుపేట మండలాల్లో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాజెక్టు సందర్శించిన, అనంతరం గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన పోడు పట్టా భూములను పరిశీలించి గిరిజన రైతులతో సమావేశం అవుతారన్నారు.