MBNR: హన్వాడ మండలం మాదారం రామకొండపై కొలువుదీరిన శ్రీ తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు శేషవస్త్రం సమర్పించారు.