మేడ్చల్: ఘటకేసర్ మండలం, ప్రతాపసింగారానికి మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ZPHS వార్షికోత్సవ వేడుకలకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు హాజరుకానున్నారు. పాఠశాలలో అన్ని ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రుల రానుడంటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. పోలీస్ బలగాలు మోహరించి, పరిసరాలను పర్యవేక్షించారు.
BDK: పినపాక మండలం పోట్లపల్లి అడవి ప్రాంతంలో పులి సంచరిస్తున్న సమాచారం అందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలు, ఇతర ఆధారాలను అన్వేషిస్తున్నారు. అన్వేషణలో ఎఫ్డిఓ సయ్యద్ మల్సూర్, రేంజర్ ఉపేందర్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
KMM: హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి సీతక్కను ఛాంబర్లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే మట్టా రాగమయి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించి వినతిపత్రాన్ని ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, ఖాళీ పోస్టుల భర్తీ, వేతనాల చెల్లింపు అంశాలను చర్చించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
KMR: బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని దేవేంద్రుని గుట్టపై బుధవారం భక్తులు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్యను పురస్కరించుకొని గుట్టపై ఉన్న గుండంలో భక్తులు తల స్నానాలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న దేవేంద్రుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
NZB: జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KMR: జిల్లా కేంద్రంలో నేడు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ శిబిరం ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు క్యాంపులో సంబంధిత దివ్యాంగులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
HYD: గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారులు దాడులు నిర్వహించారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్కు చెందిన 9 మంది ఫారిన్ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తాడ్వాయి మండలంలో బుధవారం పర్యటించనున్నారు. మండలంలోని సంతాయిపేట గ్రామంలో భీమేశ్వర స్వయం భూ లింగ దివ్య క్షేత్రంలో నిర్వహిస్తున్న మాఘ అమావాస్య మహా జాతర కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ జాతరలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
KMR: గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ రేవు బ్రిడ్జి పనులకు సంబంధించి మంగళవారం సాయంత్రం పంచాయతీరాజ్ అధికారులు ప్రాథమిక సర్వేను చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పు రాజులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ ఆదేశానుసారం సర్వేను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
JGL: మానవ హక్కుల సంఘ సభ్యులు గన్నారపు శంకర్ మెట్పల్లి డీఎస్పీ రాములును మంగళవారం కలిసారు. కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో యువత దారి తప్పుతోందని, యువతపై ప్రత్యేక దృష్టి సారించి మాదకద్రవ్యాల పై గ్రామాల్లో సంఘాలు, పిల్లలు, పెద్దలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆయన వెంట సంతోష్ తదితరులు ఉన్నారు.
JN: తమ్మడపల్లి, జఫర్గడ్, జనగాంకి చెందిన మంగళవారం సాయంత్రం నుంచి ముచర్ల కొమురమ్మ కనబడకుండా పోయింది అని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. పసుపు రంగు చీర, ఆకు పచ్చ జాకెట్ ధరించి ఉందని సమాచారం. కొంచెం మతిస్థిమితం లేదు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నెంబర్ 9676060190కు సంప్రదించాలని సూచించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో ఇంఛార్జీ కమిషనర్ అరుణ శ్రీ పర్యటించారు. ఈ మేరకు రహదారులకు, వాహనాల రాకపోకలకు అడ్డుగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వివిధ కాలనీలలో ఉన్న డ్రైనేజీలను పరిశీలించి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని, మంచినీటి పైప్ లైన్ల లీకేజీలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.
PDPL: రామగుండం మున్సిపల్ పరిధి 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో హజ్రత్ తాజుద్దీన్ బాబా 164వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చాదర్ సమర్పించి, ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
SRCL: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్. రజిత మాట్లాడుతూ.. వ్యాధిపై అవగాహన పెంచుకొని అపోహలను దూరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంపత్, అనిత, శివరామకృష్ణ, శ్రీనివాస్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
JGL: జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం డీహెచ్ఓ ప్రమోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో 78 స్కానింగ్ సెంటర్లు అనుమతి పొంది ఉన్నాయన్నారు. గర్భవతిగా నమోదైనప్పటి నుంచి ఆశా వర్కర్లు ఇంటికి వెళ్లి వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు. సమావేశంలో ఉపవైద్యాధికారి శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, తదితరులున్నారు.