KNR: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నిరసిస్తూ బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
SRD: మనూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు కావడంతో వాహనాల తనిఖీలు రెగ్యులర్ గస్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
WGL: పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ వారి ఆర్థిక సాయంతో పలువురు మహిళలకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం భాస్కర్లు హాజరై మాట్లాడారు. మహిళలు ఉపాధిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
NRML: జన సంచార ప్రదేశాల్లో వేసవికాలం దృష్ట్యా చలి కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్టాండ్, మంచిర్యాల తదితర ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
SRCL: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని గారువేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, ఆలయ సిబ్బంది ఉన్నారు.
JN: స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో వెంకన్న అఖిలపక్ష నాయకులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అన్ని పార్టీల నాయకులు బిఎల్ఏలను నియమించుకొని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ వారధిగా ఉంటూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, వివిధ పార్టీల నేతలు ఉన్నారు.
WGL: రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అని మాజీ మంత్రి, శాసన మండలి BRS పార్టీ విప్ సత్యవతి రాథోడ్ అన్నారు. ఎండిన వరితో అసెంబ్లీ ప్రాంగణంలో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు అందోళన చేపట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా? అంటూ విమర్శలు గుప్పించారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ, వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యా రంగం, శాంతి భద్రతలు వంటి పలు అంశాలపై వీరు చర్చించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
WGL: నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, వరంగల్ జిల్లా ప్రజలు ముఖ్యమైన అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మామునూరు విమానాశ్రయ అభివృద్ధి, ORR (ఒరే రింగ్ రోడ్డు) మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
HYD: అంతరాష్ట్ర పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 10 మంది పసి పిల్లలను ముఠా చెర నుంచి రక్షించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు ముఠాలో కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన ముఠాకి, ఈ ముఠాకి సంబంధాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
MBNR: తొర్రూరు మండలం వెలికట్టే శివారులో మంగళవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెలికట్టే శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని, లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామన్నారు.
HNK: గోవాలో ఐదు రోజులపాటు జరిగే నలభై ఏడవ భారత మాస్టర్స్ (వెటరన్) నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు హనుమకొండ జేఎన్ఐఎస్ నుండి 18 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనేందుకు నేడు వెళ్లారు. టీబిఏ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో షటిల్ క్రీడాకారులు ఉత్సాహంగా హనుమకొండ నుండి గోవా బయలుదేరారు.
BDK: ఏప్రిల్ 6న శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పేర్కొన్నారు.
జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.
KMM: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి ప్రస్తావించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు.