NLG: నల్గొండ పట్టణంలోని నడ్డివారి గూడెంలో పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపెల్లి సత్తయ్య గురువారం సంతకాల సేకరణను చేపట్టారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఉపాధి హామీ పథకం వర్తింప చేయాలని కోరుతూ… సీఎంకు పంపించే లేఖ పై పేదలతో ఆయన సంతకాలు చేయించారు. ఈనెల 24న ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొనాలని కోరారు.