NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో 96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని 297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యామ్ సంబంధిత ప్రధాన పనులు కాలువలు డిస్టబ్యూటరీ పనులను చేపడుతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.