KMR: బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని శ్రీ సిద్ధి రామేశ్వర ఆలయంలో ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్న బాల్యాల లక్ష్మీనారాయణను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత నెల ఆలయ హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన డబ్బులను తస్కరించిన ఘటనలో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.