GNTR: సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసిన పాలిసెట్-2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 4,129 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2587 మంది బాలురు, 1542 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 96.52% గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 97.99%గా నమోదైంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 97.07%గా ఉంది.