BHPL: విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తును సాధించగలరని భూపాలపల్లి పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ అన్నారు. గొల్లబుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్ పాల్గొన్నారు.