MDK: మంత్రాలు, చేతబడి అనేది లేదని, ఎవరైనా మంత్రాలు చేస్తామంటూ గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈమధ్య మంత్రాల నెపంతో ప్రజలను మోసం చేస్తున్నారని, దొంగ బాబాలను నమ్మొద్దని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని సూచించారు.