KMR: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో అభయహస్తం సొసైటీ సహకారంతో బర్ల గంగారం, బర్ల మధు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.