MNCL: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి, మంచిర్యాల ఆర్టిఏ మెంబర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. గ్రామంలో 189 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు పాల్గొన్నారు.