• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డిగ్రీ కళాశాల విద్యార్థులు.. ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం నుంచి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి ఆదేశానుసారం క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం దేవరకొండ ఖిల్లాను సందర్శించారు. ఈ క్షేత్ర పర్యటన వలన విద్యార్థులు శిల్ప కళా సాహిత్యము, స్థానిక చరిత్ర విజ్ఞాన విశేషాలను విద్యార్థులు తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు.

January 31, 2025 / 06:44 PM IST

మాజీ మున్సిపల్ ఛైర్మన్‌కు కేటీఆర్ సన్మానం

NLG: చండూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్నను శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన మంచి పనులే చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని కాంక్షించారు.

January 31, 2025 / 06:36 PM IST

‘ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించింది’

NLG: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు. నల్గొండలోని NG కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా విద్యా రంగానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ , ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు.

January 31, 2025 / 06:27 PM IST

పదవి విరమణ పొందిన ఎస్సైకి జిల్లా ఎస్పీ సన్మానం

NLG: జిల్లా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న CH వెంకటయ్య పదవి విరమణ పొందడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో 41 ఏళ్లు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమన్నారు.

January 31, 2025 / 06:14 PM IST

పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవలు

NRML: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా RTA అలీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, రోడ్డు నియమాలు పాటిస్తూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉంచుకోవాలని అన్నారు.

January 31, 2025 / 02:20 PM IST

‘మాజీ మున్సిపల్ ఛైర్మన్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

MNCL: బెల్లంపల్లి పట్టణం 2వ వార్డ్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారులపై మాజీ మున్సిపల్ ఛైర్మన్ సూరిబాబు ఇష్టారీతిన మాట్లాడడాన్ని నిరసిస్తూ BRSV ఆధ్వర్యంలో RDOకు శుక్రవారం మెమోరాండం సమర్పించారు. దళిత తహసీల్దార్‌పై బేదిరింపులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

January 31, 2025 / 02:02 PM IST

పెద్దలకు రోడ్డు భద్రతపై చెప్పాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది: సీఐ

వనపర్తి: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలీస్ సీఐ కృష్ణ హాజరై మాట్లాడారు. పిల్లలపై చాలా గురుతర బాధ్యతలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములతో సుఖసంతోషాలతో ఉండాలంటే వారి పెద్దలకు రోడ్డు భద్రతపై చెప్పాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పించారు. వాహనాలపై బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ మరిచిపోవద్దని తెలపాలన్నారు.

January 31, 2025 / 01:42 PM IST

మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు

MNCL: మంచిర్యాల జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నస్పూర్‌లోని కేజీఎ డీఫెన్స్ అకాడమీ గ్రౌండ్‌లో ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్-15 బాల బాలికల ఛాంపియనషిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అద్యక్ష & కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, అవునూరి మహేష్‌లు తెలిపారు. సుమారు 25 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలిపారు.

January 31, 2025 / 01:38 PM IST

బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు

ASF: బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అనిల్ గౌడ్ అన్నారు. శుక్రవారం తిర్యాణి మండల కేంద్రంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

January 31, 2025 / 01:19 PM IST

‘ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలి’

NRML: జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణం టిఎన్జీవో భవన్‌లో ఎయిడ్స్ వ్యాధి అవగాహనపై జిల్లా స్థాయి పోస్టర్ పోటీలను డిఇఓ రామారావు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేయబడ్డ జీవశాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని డిఈఓ ఈ సందర్భంగా కోరారు.

January 31, 2025 / 01:04 PM IST

సాంప్రదాయ దుస్తుల్లో కేస్లాపూర్ వెళ్లిన ఎమ్మెల్యే

ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా ఆలయం వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ శుక్రవారం ఉట్నూర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో సాంప్రదాయ వస్త్రాలను ధరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఆయనతో ఉత్సాహంగా ఫోటోలు దిగారు.

January 31, 2025 / 12:47 PM IST

విగ్రహ ప్రతిష్ఠకు రూ .60,116 విరాళం అందజేత

WNP: కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో ప్రతిష్ఠించనున్న శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు పట్టణ కేంద్రానికి చెందిన శైలజ, బాలరాజ్ దంపతులు నేడు రూ.60,116 విరాళంగా అందజేశారు. ఫిబ్రవరి 13,14, 15 తేదీల్లో నిర్వహించే ప్రాతఃకాల విగ్రహ ప్రతిష్ఠకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వహకులు కోరారు.

January 31, 2025 / 12:38 PM IST

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎప్పడూ ఉంటాయి: ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని వెలిసిన చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే మేఘ రెడ్డి శుక్రవారం జాతర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమ్మవారి ఆశీస్సుల ఎల్లపుడూ, ప్రజల పై ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

January 31, 2025 / 12:35 PM IST

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి: బీజేపీ

WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో మున్సిపల్ కార్యాలయాల వద్ద శుక్రవారం బీజేపీ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీలోని 10వ వార్డులో అనర్హులకు ఇళ్లు కేటాయించారని వారు ఆరోపించారు. అర్హులకు ఇల్లు ఇవ్వాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

January 31, 2025 / 12:28 PM IST

కొనసాగుతున్న కార్మికుల నిరాహార దీక్షలు

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4న వరంగల్‌లో జేఎల్సీ సమక్షంలో జరిగే చర్చల్లో కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

January 31, 2025 / 12:13 PM IST