ADB: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సమక్షంలో తిర్యాని మండలానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. వారికి సుగుణ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
ADB: ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోనాల మండలంలోని సాకేర గ్రామంలో మందిరానికి వెళ్లే మెట్ల మార్గానికి రూ.2.5 లక్షల నిధులతో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని గజేందర్ పేర్కొన్నారు.
MDCL: మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టబడ్డాయి. రాంపల్లిలో సుమారు 3 వేలకు పైగా, దుండిగల్ ప్రాంతంలో కూడా 3 వేలకుపైగా ఇండ్లు నిర్మించారు. అదే విధంగా అహ్మద్గూడ, మన్సాన్పల్లి, శంకర్పల్లి, నల్లగండ్ల, నర్సింగ్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో కూడా ఈ ఇండ్లు ఉన్నాయి.
KNR: జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన గుడిసెల్లో ఉంటున్న ఓ చిన్నారిని లారీ ఢీకొంది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక రోడ్డు పక్కన ఆడుకుంటుండగా లారీ వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHNG: జిల్లాలోని మోత్కూరు, గుండాల, ఆత్మకూర్ వివిధ మండలాలలో సాయంత్రం వేళ చిరుజల్లులు కురిసాయి. ఈ యొక్క చిరు జల్లులే పెద్దవానగా మారాలని రైతన్నలు వేడుకుంటున్నారు. సకాలంలో వర్షాలు పడక తాము పెట్టుబడి పెట్టిన పంటలు భారీగా నష్టపోయామని, ఈ వర్షానికైనా మిగిలిన పంట చేతికి అందాలని ఆ దేవున్ని కోరుకుంటున్నామని రైతులు అంటున్నారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 7వ వార్డులో లబ్ధిదారురాలు తోకలి మల్లమ్మ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత శనివారం ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన దంపతులకు ఆమె సారె పెట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
HYD: మార్చి 22న ఇండోర్లో జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎగ్జిబిషన్, చెన్నైలో నిర్వహించే ట్రావెల్ టూరిజం ఫైర్లలో హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో టూరిజం మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమాలు కీలకంగా మారనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి దశలోనే రెండు కోట్లకుపైగా పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు తెలిపారు.
ADB: జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం బోథ్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా నూతన గదిని SP ప్రారంభించారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
JGL: నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పెన్షనర్లను నిరాశ పరిచిందని, తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.
NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో జీవన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.
NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో జీవన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.
HNK: కాజీపేట మండలం కడిపికొండలో రాజశేఖర్ (51)కుమార్తె రాజశ్రీ (24) సజీవదహనం ఘటన దర్యాప్తులో హత్యగా తేలింది. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటనలో కట్నం వేధింపుల నేపథ్యంలో రాజశ్రీ భర్త ప్రవీణ్ డీజిల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
MNCL: జైపూర్ మండలంలోని టేకుమట్ల చెరువు కట్ట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఎదురుదురుగా ఢీకొన్నాయని ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMM: రంజాన్ సందర్భంగా నిరుపేదలకు చేయూతనివ్వడం గొప్ప సందేశమని టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కొనియాడారు. ఖమ్మం టీఎన్జీవో కార్యాలయంలో పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలాపురం గ్రామానికి చెందిన ఎం.ఫార్మసీ విద్యార్థిని వైష్ణవికి రూ. 20,000 ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. విద్యార్థిని ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు.
PDPL: DCC అధికార ప్రతినిధిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పెండ్యాల మహేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ NTPCలో సీనియర్ న్యాయవాదులు పులిపాక ప్రవీణ్, సతీష్ రెడ్డి, NSUI రాష్ట్ర కార్యదర్శి బైరమల్ల ప్రసాద్, తదితరులు మహేష్ను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.