ADB: కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం కోరారు. ఆదివారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అభయారణ్యంలో భారీ వాహనాలను అనుమతించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాత్రివేళల్లో లోకల్, నాన్ లోకల్ వాహనాలను కూడా అటవీ అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు.
KMR: గురుకుల పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు బిక్కనూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ST, SC, BC మైనార్టీ గురుకులాలలో చదివే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
SRPT: గొర్రెల, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు(M) కాప్రాయిపల్లిలో చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLG జిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
NLG: చిట్యాల మండలంలోని వట్టిమర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం వట్టిమర్తి మాజీ సర్పంచ్ రాచమల్ల రామచంద్రం స్మారకార్థం విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు, ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు జిట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
KMM: దూరాజ్పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు.
JGL: మెట్ పల్లి మండలం మేడిపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలను శనివారం మున్సిపల్ కమిషనర్ మోహన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైట్ మెనూ, వంటగది, స్టోర్ రూమ్స్, క్లాస్ రూమ్స్, వండిన అన్నం, కూరలను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తదితరులున్నారు.
KNR: శంకరపట్నం మండలం మక్త శివారులో శనివారం సాయంత్రం బైక్ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారంకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న మక్త గ్రామానికి చెందిన ఎలుకపల్లి నర్సమ్మను ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు.
BDK: గుండాల మండల కేంద్రంతో పాటు మామకన్ను గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యా చందన విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం స్థల సేకరణను శనివారం పరిశీలించారు. అనంతరం కాచనపల్లి, ముత్తాపురం, లింగగూడెం, రోళ్లగడ్డ, గుండాల గ్రామాల్లో నర్సరీలను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, పాల్గొన్నారు.
SDPT: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన బాకీ బిక్షపతి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BRS సీనియర్ నాయకులు చింతల కుమార్, నాయకులు శనివారం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు.
SDPT: సిద్దిపేటకు చెందిన మహిళ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ మహేశ్ వెంటనే స్పందించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు.
మెదక్: రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు తెలిపారు.
HYD: వెనుకబడిన BC వర్గాలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కొరకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జల సత్యం కోరారు. తెలంగాణ ప్రభుత్వమైన తీర్మానం ప్రవేశపెట్టి బీసీల పక్షాన నిలబడాలని కోరారు.
MNCL: జన్నారం మండల ఇన్చార్జి ఎంపీడీవోగా ఉమర్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు జన్నారం మండల ఎంపీడీవోగా పనిచేసిన శశికళ ఠాకూర్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆమె స్థానంలో హాజీపూర్ ఇంఛార్జ్ ఈఓపిఆర్డిగా పనిచేస్తున్న ఉమర్ షరీఫ్ ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంఛార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు.
ASF: కాగజ్నగర్లో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రామానుజన్ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్నగర్లోని శ్రీబాబు కాలనీ, మారుతీనగర్లో శనివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్లు, ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు.
NLG: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్లకు HYDలోని TG భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ను కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ MLA చిరుమర్తి లింగయ్యలు శాలువాలు మెమెంటులతో సత్కరించారు.