ADB: జిల్లా కేంద్రంలోని TTDCలో విపత్తు నిర్వహణపై సోమవారం నుంచి ఈనెల 29వరకు మర్రిచెన్నారెడ్డి ఇన్’స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18నుంచి 40సంవత్సరాల వయస్సు కలిగి, పదవ తరగతి పాసైన 50మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భోజనం ఖర్చులకు వంద రూపాయలతోపాటు రాత్రి వసతి ఉంటుందన్నారు.