MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాధ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామ శివారులో పాడైన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.