SDPT: రంగధాంపల్లి నుంచి పొన్నాల వెళ్లే మార్గంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జె. మర్ఫీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 786 గ్రాముల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరచుకుని సీజ్ చేశారు.