ADB: గుడిహత్నూర్ మండలంలోని గోండ్ హర్కాపూర్ గ్రామంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ నూతన సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు.