KMM: ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే.చాంద్ పాషా అన్నారు. శనివారం రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ జూలూరుపాడు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం చాంద్ పాషా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా నేటికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు.