NZB: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నర్సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరోసిన్ డబ్బాతో వచ్చిన నర్సింగ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. కోర్టు సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. తన తండ్రి వ్యవసాయ శాఖలో పని చేస్తూ మృతి చెందాడని, కారుణ్య నియామకం కింద తనకు రావాల్సిన ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నాడు.