• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కానిస్టేబుల్ సస్పెండ్

NZB: జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సిద్దిరాం చిన్నయ్య (2135) కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్‌పై వేటు పడడం కలకలం రేపింది.

May 2, 2025 / 07:31 PM IST

వైన్స్‌లో గొడవ.. యువకుడు మృతి

మేడ్చల్: కూకట్‌పల్లి PS పరిధిలోని దారువాల వైన్‌షాప్ పర్మిట్ రూమ్‌లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రకారం.. గత నెల 5న కేశవ్, ధనుష్ ఇద్దరు దారువాల వైన్స్ పరిమిట్ రూంలో మద్యం తాగుతుండగా గొడవ జరిగింది. ధనుశ్‌పైన కేశవ్ అతడి స్నేహితులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. గాయాలపాలైన అతడు ఇవాళ మృతి చెందాడు.

May 2, 2025 / 07:07 PM IST

వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

KMR: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చల్లని ప్రదేశాల్లో ఉండాలన్నారు. బయటకు వెళ్తే టోపీ, తలపాగా వాడాలని సూచించారు. మజ్జిగ, గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.

May 2, 2025 / 07:05 PM IST

కాంగ్రెస్ ఒత్తిడితోనే దేశవ్యాప్త కులగణన: ఎమ్మెల్యే

KMR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విజయవంతంగా చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే దేశవ్యాప్త కులగణన చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఉన్నారు.

May 2, 2025 / 06:16 PM IST

ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి: సీపీ

NZB: ప్రతి ఒక్కరూ ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు. ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిదన్నారు. మనిషిని మనిషిగా గౌరవించాలని హితవు పలికారు.

May 2, 2025 / 06:13 PM IST

మహిళా సహకార సంఘాలు సమిష్టితోనే కృషి

NZB: మహిళా సహకార సంఘాలు సమిష్టి కృషితో అన్ని రంగాల్లో రాణిస్తున్నాయని డీపీఎం మారుతి అన్నారు. నూతనంగా ఎన్నికైన జనరల్ బాడీ సభ్యులు అంకితభావంతో నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా పనిచేసే సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మండల మహిళా సమైక్య 19వ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది.

May 2, 2025 / 06:08 PM IST

మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్

KMR: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత(44) అనే మహిళను చీరతో ఉరి వేసి హత్య చేశాడు. 

May 2, 2025 / 05:57 PM IST

‘పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’

KMR:పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని వాడి గ్రామంలో వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

May 2, 2025 / 05:35 PM IST

పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభినందించిన జిల్లా ఎస్పీ

WNP: వనపర్తి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్తునికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 25 వేల జరిమానా విధించడంలో, జిల్లాలో వివిధ కేసులో నేరస్తులకు శిక్ష పడడంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస చారీని వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ శాలువాతో సన్మానించి అభినందించారు.

May 2, 2025 / 05:02 PM IST

ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

WNP: జిల్లాలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పనులు ప్రారంభించని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి.. ఇంటి నిర్మాణంపై ఆసక్తిలేని లబ్ధిదారులను గుర్తించాలన్నారు.

May 2, 2025 / 04:58 PM IST

డిస్టిక్ టాపర్ అభినదించిన శ్రీనివాస్ రెడ్డి

RR: మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ పదో తరగతిలో రంగారెడ్డి డిస్టిక్ టాపర్‌గా మార్కులు సాధించిన పాపిశెట్టి కార్తీక్ అనే విద్యార్థిని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. మన డివిజన్ విద్యార్థి జిల్లా టాపర్ కావడం చాలా ఆనందదాయకమన్నారు.

May 2, 2025 / 04:48 PM IST

ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

HYD: జనగణనతో పాటు కులగణనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదములు తెలుపుతూ అత్తపూర్‌లో డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా సెక్రెటరీ కొమురయ్య ఉన్నారు.

May 2, 2025 / 04:44 PM IST

సిగరెట్ ఇవ్వలేదని MURDER..!

HYD: పాతబస్తీ ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలకుంటా చస్మా ప్రాంతంలో మజీద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి మజీద్‌పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

May 2, 2025 / 04:37 PM IST

నల్ల బ్యాడ్జీలతో ఉపాధి హామీ ఉద్యోగుల నిరసన

KMM: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉపాధి హామీ ఉద్యోగులు మధిర ఎంపీడీవో కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. గత మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

May 2, 2025 / 01:35 PM IST

విద్యాసంస్థల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం కృషి: ఎంపీ

KMM: విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాయిలెట్స్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.37 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

May 2, 2025 / 01:10 PM IST