• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలి’

JGL: ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరుతూ రాయికల్ పట్టణ వార్డు సభ్యులు భూస గంగ మల్లయ్య, అనుమల్ల రమ రాయికల్ విద్యుత్ ఏఈ నవీన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి నిర్మాణాలు పూర్తి కావస్తున్నందున, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ స్తంభాలు వేసి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.

March 19, 2026 / 02:29 PM IST

కదిలి ఆలయంలో ఉగాది వేడుకలు

NRML: దిలావర్పూర్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ మాతా అన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గ్రామస్థులు పోటెత్తారు. వేద పండితులు వినిపించిన నూతన సంవత్సర ఫలితాలను భక్తులు ఆసక్తిగా విన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

March 19, 2026 / 02:28 PM IST

మార్కెట్‌లో శనగలు క్వింటా ధర ఇలా.!

KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో శనగలు ప్రస్తుతం క్వింటాకు రూ.5,250 ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. 2 రోజుల్లో క్వింటాకు రూ.50 పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రైతులు కొనుగోలు ఈ కేంద్రం ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటులో కంటే ప్రభుత్వ ధర క్వింటాకు రూ.600 వరకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.

March 19, 2026 / 02:28 PM IST

4 గ్రామాలకు ఎంపీ నిధులు మంజూరు

NRPT: ధన్వాడ మండలంలోని ధన్వాడ, మంత్రోనిపల్లి, కంసాన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని సర్పంచులు జ్యోతి రామచంద్రయ్య, రవికుమార్, కొండయ్య గురువారం వెల్లడించారు. మంజూరైన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 02:22 PM IST

గంగమ్మ తల్లికి మంగళహారతులు..!

SDPT: చిన్నకోడూరులోని గంగమ్మతల్లికి 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంగళ హారతులు సమర్పించనున్నట్లు గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

March 19, 2026 / 02:20 PM IST

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బారులు తీరిన భక్తుల

MDCL: ఉగాది పండుగను పురస్కరించుకుని అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.

March 19, 2026 / 02:20 PM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లిబిడ్డ క్షేమం

BDK: దమ్మపేట(M) గండుగులపల్లికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆడ్డ బిడ్డకు జన్మనించింది. మెరుగైన చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.

March 19, 2026 / 02:20 PM IST

SFI రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్‌గా రాము

MBNR: పాలమూరు యూనివర్సిటీలో మార్చి 17, 18 తేదీలలో నిర్వహించిన SFI రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌లో పాలమూరు యూనివర్సిటీకి చెందిన బత్తిని రాము రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బత్తిని రామును యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

March 19, 2026 / 02:15 PM IST

‘కార్మికులకు రూ. 26వేల వేతనం ఇవ్వాలి’

SRD: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.

March 19, 2026 / 02:14 PM IST

ప్రత్యేక పుజాలు చేసిన మట్టా దయానంద్

KMM : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ కామాక్షి ఏకామేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 19, 2026 / 02:10 PM IST

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

MNCL: తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. దీంతో ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన వర్షిత ఇవాళ ఉరేసుకుని మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

March 19, 2026 / 02:10 PM IST

ఉగాది పచ్చడి పంపిణీ చేసిన బీజేపీ వార్డు మెంబర్

MNCL: కాసిపేట మండలం, కొండాపూర్ యాప వద్ద బీజేపీ నాయకులు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన మండలంలోని తొలి బీజేపీ వార్డు మెంబర్ ముత్యాల నవీన్ కుమార్ యాదవ్ ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికి సుఖ సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 02:10 PM IST

కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

NLG: చిట్యాల మండలం వెలిమినేడు, బొంగోని చెరువు గ్రామాల్లో ఈ నెల 27న జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను గురువారం సర్పంచులు, గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా పురోహితులు వావిలాల ప్రభాకర్ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్‌లు బొంతల చంద్రారెడ్డి, ఆశయ్య, ఛైర్మన్ సాయికృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

March 19, 2026 / 02:07 PM IST

గబ్బిలాల వల్ల షార్ట్ సర్క్యూట్.. మూడు చోట్ల తెగిన తీగలు

MHBD: కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామ పరిధిలో గురువారం గబ్బిలాలు విద్యుత్ లైన్లపై పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మూడు చోట్ల తీగలు తెగిపోయాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ అశోక్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

March 19, 2026 / 02:06 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డు ప్రమాదం

నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. సరైన యూ-టర్న్ లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్తున్నారని, అందుకే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

March 19, 2026 / 02:06 PM IST