BDK: మెరుగైన వైద్యం పొందలేని పేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం బూర్గంపాడు మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పది మందికి గాను రూ.5,85,000 విలువ గల చెక్కులను అందజేశారు.
SRD: ప్రజలకు సైబర్ మోసాలు బెట్టింగ్ యాప్స్పై అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సివిల్ తగాదాలు తల దూర్చవద్దని సూచించారు.
NGKL: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లోని LIC ఆఫీస్ పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SRD: చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూను ఉప కులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్డీవో పాండు చేతుల మీదుగా జయంతికి సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ నరసింహ, ఫార్మసీ ప్రిన్సిపల్ సునీత రెడ్డి పాల్గొన్నారు.
NLG: కట్టంగూర్ మండలం ఈదులూరు వాసి గద్దపాటి నరసింహను కుల సంఘానికి తన భూమి ఇవ్వలేదని 3 ఏళ్ల క్రితం కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. నరసింహ ఇంటికి ఎవరూ వెళ్లొద్దని, అతడు కూడా ఎవరింటికీ రావద్దని తీర్మానించారు. అప్పటి నుంచి నరసింహ మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల ఓ కార్యానికి నరసింహ రాగా కులపెద్దలు వెళ్లిపోమ్మన్నారు. శుక్రవారం బాధితుడు పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
SRD: ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో యువ వికాసం సహాయ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
BHPL: ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను తీసుకురావాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం పలు మండల ప్రత్యేక అధికారులతో ఐడీవోసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
NLG: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం నెలకొందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సమీక్షలు లేవు, కొనుగోలు కేంద్రాలపై మాట్లాడడం లేదన్నారు.
MBNR: జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం మంజూరు అయింది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇది ప్రారంభంకానుంది. ఇందులో నాణ్యమైన మందులు తక్కువ ధరలకు లభించనున్నాయి. దీంతో పేద ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి.
NLG: చందంపేట మండలం పోలేపల్లి వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. ఈనెల 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
KNR: ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.
PDPL: రామగుండం కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ సహా ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. సమాజంలో మహిళల భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 1091 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.గత నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో 3,4, 5 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తున్నామని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంపన్నులతో సమానంగా భోజనం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు.
HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట నేడు వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ప్రారంభించారు. అకాల వర్షాలు అనావృష్టి సమస్యల నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిర్రా నర్సింగ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చాంద్ పాషా పాల్గొన్నారు.