NLG:- ఈనెల 14న తిరుమలగిరి మండలం మాలిపురంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. గురువారం శాలిగౌరారంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.