ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గురువారం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అలవాట్లలో మంచి మార్పులు తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతున్నామని ప్రిన్సిపాల్ ప్రశాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరీం, రాజేంద్రప్రసాద్, అయ్యుబ్ ఖాన్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.