ప్రకాశం: పామూరు పట్టణంలోని ప్రజలు చెత్తను రోడ్డుపైన, మురుగు కాలువల్లో వేయవద్దని పంచాయితీ కార్యదర్శి అరవింద విజ్ఞప్తి చేశారు. గురువారం పామూరులోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటించారు. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో పంచాయితీ కార్మికుల చేత తీసివేయించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు తమ ఇంటి ముందుకు వచ్చే పంచాయతీ కార్మికులకు చెత్తను అందజేయాలని కోరారు.