NLR: వెంకటాచలం మండలంలోని కంటేపల్లి గ్రామంలో శుక్రవారం సుపరిపాలన పై తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. అనంతరం ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. సంక్షేమ పథక వివరాలను స్థానిక ప్రజలకు వివరించారు.