ADB: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మగవారిపై ఆర్థిక భారం పెరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా బోథ్ ఇన్ఛార్జ్ మజార్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లా నుంచి గుడిహత్నూరు వరకు రూ.30 ఉన్న టికెట్ ధరను రూ.50కి పెంచారని అన్నారు. దీంతో ప్రతిరోజు ప్రయాణించే పురుషులకు అదనపు ఆర్థిక భారం పెరుగుతుందని పేర్కొన్నారు.