MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.