SRD: సదాశివపేట మండలం ఎంకేపల్లి గేటు వద్ద విజయలక్ష్మి(45) అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి గురువారం పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆమెను సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.