SDPT: అక్కన్నపేట మండలంలోని కపూర్ నాయక్ తండా పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నందారం స్టేజి సమీపంలో గొర్రెలను మేపుతుండగా, ఒక గొర్రె అదృశ్యమైంది. యజమాని వెంకటేశ్ పొదల్లో వెతకగా, భారీ కొండచిలువ గొర్రెను చుట్టేసి చంపేసిన దృశ్యం కనిపించింది. ఈ ఘటనతో స్థానిక గొర్రెల కాపరులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.